భారతీ ఎయిర్టెల్ కీ రిలయన్స్ జియో కీ మధ్యన యుద్ధం ఆగినట్టే కనిపిస్తోంది కానీ ఎక్కడా ఆగడంలేదు. టెలీకాం నియంత్రణ సంస్థ ట్రాయ్ ఇప్పుడు వీరిద్దరి మధ్యలో ఇరుక్కుంది. జియో చేస్తున్న అన్యాయం చూడాలి అంటూ ట్రాయ్  ని ఆశ్రయించింది ఎయిర్టెల్. సమ్మర్ సర్‌ప్రైజ్ ఆఫర్‌ను రద్దు చేసిన జియో ఇటీవల ప్రకటించిన ‘ధన్ ధనా ధన్’ ఆఫర్ కొత్త సీసాలో పాత నీరు లాంటిదని వ్యాఖ్యానించింది. పేరు మార్చి దానినే కొనసాగిస్తోందని, అడ్డుకోవాలని కోరింది. పేర్లు వేరైనా ఆఫర్‌లో తేడా లేదని వాదిస్తోంది. ‘ధన్ ధనా ధన్’ అంటే హిందీలో ‘డబ్బు డబ్బు డబ్బు’ అని అర్థం వచ్చేలా ఉందని, ట్రాయ్ మార్గదర్శకాల స్ఫూర్తికి ఇది పూర్తి విరుద్ధమని ఎయిర్‌టెల్ పేర్కొంది.


మరింత సమాచారం తెలుసుకోండి: