ఉచితంగా డేటా, కాల్ ఆఫర్లను ఇచ్చినంతకాలం రిలయన్స్ జియోవైపు మొగ్గుచూపిన కస్టమర్లు, గడచిన ఏప్రిల్ నుంచి టారిఫ్ వసూలును ప్రారంభించే వరకు, ఇక జియో వద్దంటూ తమ పాత సర్వీస్ ప్రొవైడర్ల నంబర్లనే వాడటం మొదలు పెడుతుండటంతో జియోకు భారీ షాకే తగులుతోంది. ఇదే సమయంలో జియో పుణ్యమాని మిగతా టెలికం సంస్థల డేటా రేట్లు కూడా దిగిరావడంతో కస్టమర్లు జియోను వీడుతున్నట్టు తెలుస్తోంది.


ఇక తమ నుంచి జియోకు వెళ్లిన ఖాతాదారుల్లో చాలా మంది తిరిగి వెనక్కు వచ్చారని, దీని ప్రభావంతో కొత్త ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో నష్టాల నుంచి గట్టెక్కుతామన్న నమ్మకం ఉందని ఐడియా సెల్యులార్ మేనేజింగ్ డైరెక్టర్ హిమాన్షు కపానియా అంచనా వేశారు.


చార్జీల వసూళ్లు ప్రారంభించిన తరువాత డేటా కస్టమర్లు జియో నెట్ వర్క్ ను వీడుతున్నారని ఆయన అన్నారు. తొలి త్రైమాసికంలో రెవెన్యూ వృద్ధిని తాము ముందుగానే ఊహించామని, జనవరి - మార్చి నష్టాల నుంచి ఈ సంవత్సరం 15 శాతం రికవరీ సాధిస్తామని అన్నారు. గత సంవత్సరంతో పోలిస్తే టెలికం ఇండస్ట్రీ 14 శాతం వరకూ ఆదాయాన్ని కోల్పోయిందని పేర్కొన్నారు. జియో గొడుగు కిందకు 7.5 కోట్ల మంది కస్టమర్లు చేరినప్పటికీ, తమకు కలిగిన నష్టం స్వల్పమేనని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: