దేశీయ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ మైక్రోమ్యాక్స్ బడ్జెట్ ధరలో 4జీ ఫోన్ను విడుదల చేసి ఆకర్షిస్తోంది. ‘భారత్ 2’ పేరుతో కేవలం రూ.3,499కే ఈ ఫోన్ను ఈ రోజు విడుదల చేసినట్లు ఆ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. ఇందులోని ఫీచర్లు కూడా యూజర్లను ఆకర్షించేలా ఉన్నాయి.
మైక్రోమ్యాక్స్ ‘భారత్ 2’ ఫీచర్లు...
నాలుగు అంగుళాల డిస్ప్లే
1.3 జీహెచ్జడ్ స్ప్రెడ్ట్రమ్ ప్రాసెసర్
512 ఎంబీ ర్యామ్
4 జీబీ ఇంటర్నల్ మెమొరీ (32 జీబీల వరకు పెంచుకునే సదుపాయం)
డ్యూయల్ సిమ్
2 ఎంపీ వెనక, వీజీఏ ఫ్రంట్ కెమెరా
ఎఫ్ఎం రేడియో
ఆండ్రాయిడ్ 6.0
1,300 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం