ఇప్పుడు భారత దేశంలో టెలిఫోన్ రంగంలో ఎన్నో సంచలనాలు సృష్టించింది..జియో.  ఇక రిలయన్స్ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ  ఇప్పటి వరకు ఎన్నో అద్భుతమైన ప్రతిపాదనలు తీసుకుకొని వచ్చారు.  ప్రజలకు కమ్యూనికేషన్ మరింత చేరువ కావాలని తాజాగా జియో ఉచితంగా 4జి ఫీచర్ ఫోన్‌ను అందజేయనున్నట్టు ప్రకటించారు. ఈ ఫోన్‌లో ఫ్రీ నెట్, ఫ్రీ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు.
Image result for jio phone rs 1500 booking
ఈ ఫోన్‌ను తాజాగా ఆవిష్కరించారు కూడా.  అంతే కాదు ఈ ఫోన్ పొందాలంటే రూ.1500 డిపాజిట్ చేయాలని అవి 3 సంవత్సరాల తర్వాత తిరిగి వినియోగదారుడికే చెల్లిస్తారని అన్నారు.  అంతా బాగుంది కానీ ఈ ఫోన్ ఎలా పొందాలి..డిపాజిట్ ఎలా చేయాలి..ఎలా బుక్ చేసుకోవాలి అన్న విషయంలో వినియోగదారులు చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు.  ఆగస్టు 24వ తేదీ నుంచి ప్రీబుకింగ్స్ ప్రారంభమవుతాయని... మై జియో యాప్ ద్వారా ఈ ఫోన్‌ను బుక్ చేసుకోవచ్చని యాజమాన్యం తెలిపింది.
Image result for jio phone rs 1500 booking
 ఈ ఫోన్ బుక్ చేసుకోవడం కోసం ఓ టోల్ ఫ్రీ నంబర్‌ను కూడా అందుబాటులోకి తేనున్నట్లు ముఖేష్ అంబానీ తెలిపారు. జియో ఫోన్‌ను 1860-893-3333 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి కూడా బుక్ చేసుకోవచ్చు.  అంతే కాదు రిలయన్స్ డిజిటల్ స్టోర్‌కు వెళ్లి కూడా ఈ ఫోన్‌ను బుక్ చేసుకోవచ్చని జియో అధికారికంగా పేర్కొంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: