ఈ మద్య కమ్యూనికేషన్ రంగంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి.  ఈ నేపథ్యంలో  టెలికాం రంగ సంస్థలు కొత్త కొత్త ఆఫర్లతో జనాలను ఊదరగొడుతున్నారు.  ఇక జియో ఫోన్ రక రకాల ఆఫర్లు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే.  దీంతో మిగతా టెలికాం రంగ సంస్థలు తమ రేట్లు తగ్గిస్తున్నాయి.  తాజాగా ప్ర‌ముఖ టెలికాం రంగ సంస్థ వొడాఫోన్ మ‌రో ఆఫ‌ర్‌తో త‌మ వినియోగ‌దారుల ముందుకు వ‌చ్చింది. రూ.458తో రీఛార్జ్ చేయించుకుంటే అప‌రిమిత‌ లోకల్, ఎస్టీడీ కాల్స్, ఉచిత రోమింగ్, ప్ర‌తిరోజు 100 ఎస్‌ఎంఎస్‌లు, 1జీబీ 3జీ లేక‌ 4జీ డేటా లభిస్తాయి.

ఈ ప్లాన్ వాలిడిటీ 70 రోజులు ఉంటుంది.  ఇక రూ.509 ప్లాన్ కూడా ప్ర‌క‌టించింది. ఈ ప్లాన్‌ వాలిడిటీ 84 రోజులు ఉంటుంది. ఈ ప్లాన్ల ద్వారా రోజుకు గరిష్టంగా 250 నిమిషాల వరకు, వారానికి 1 వేయి నిమిషాల వరకు లోకల్, ఎస్‌టీడీ కాల్స్ చేసుకోవచ్చు.

ఇప్పటికే ఇలాంటి ఆఫర్లు మితగా నెట్ వర్క్ సంస్థలు కూడా అమల్లోకి తెచ్చాయి.   మార్కెట్లో రిల‌య‌న్స్ జియో అందిస్తోన్న ఆఫ‌ర్ల జోరుతో త‌మ వినియోగ‌దారులు జారి పోకుండా ఉండేందుకు ఇత‌ర టెలికాం కంపెనీలు కూడా అచ్చం అలాంటి ఆఫ‌ర్ల‌నే అందిస్తున్నాయి.  



మరింత సమాచారం తెలుసుకోండి: