అమెరికాకు చెందిన యాపిల్ నుంచి ఇటీవల విడుదలైన ఐఫోన్ టెన్ ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకుంది. నాణ్యత, భద్రత, స్టైల్ ఈ ఫోన్ సొంతం కావడంతో ఐఫోన్ విడుదలవుతోందన్న ప్రకటన రాగానే దాని కోసం క్యూలు కడతారు. ఇక టెక్‌ దిగ్గజం ఆపిల్‌ అమెరికా, ఇతర యూరోపియన్‌ దేశాల కంటే ముందస్తుగా మొట్టమొదటిసారి భారత్‌లో ఓ సరికొత్త ఐఫోన్‌ను లాంచ్‌ చేయబోతుంది. 

ఎకనామిక్‌ డైలీ న్యూస్‌ రిపోర్టు  ప్రకారం వచ్చే ఏడాది  ప్రథమార్థంలో ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియన్ మార్కెట్‌లోకి తీసుకురాబోతున్నట్టు సమాచారం.  రెండు స్టోరేజ్‌ ఆప్షన్లు 32జీబీ, 128జీబీ వేరియంట్లలో ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులోకి రానుంది.


ఐఫోన్ ఎస్ఈ2 ఫీచర్స్ ఇలా ఉన్నాయి. 
12 మెగాపిక్సెల్ వెనుక కెమెరా సెన్సార్
5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమోరా
1700 ఎంఏహెచ్ బ్యాటరీ
2జీబీ ర్యామ్
4 అంగుళాల ప్యానెల్ ఈ స్మార్ట్‌ఫోన్లో ఉంటాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: