కావల్సిన వస్తువులు: గుడ్లు: 6 బిర్యాని రైస్ తయారు చేయడానికి కావల్సినవి: బియ్యం: 2cups చికెన్ స్టాక్: 3cups(చికెన్ ఉడికించి తీసుకొన్న నీరులేదా సూప్) లవంగాలు: 4 చెక్క: చిన్న ముక్క బ్లాక్ కార్డమం: 3 బ్లాక్ పెప్పర్: 4-6 బిర్యాని ఆకు: 1 నిమ్మరసం: 2tsp ఉప్పు: రుచికి సరిపడా నెయ్యి లేదా నూనె: 1tbsp మసాలా కొరకు: నెయ్యి: 4tbsp ఉల్లిపాయ: 2(సన్నగా కట్ చేసుకోవాలి) అల్లం వెల్లుల్లి పేస్ట్: 3tsp టమోటో: 2(సన్నగా తరిగిపెట్టుకోవాలి)తాజా కొత్తిమీర తరుగు: 1/4cup కారం: 1tsp పసుపు: 1/4tsp గరం మసాలా: 1tsp పెరగు: 1/2cup నిమ్మరసం: 2tbsp గార్నిషింగ్ కోసం-లేయరింగ్ ఉల్లిపాయ: 1(కొంచెం మందంగా తరిగిపెట్టుకోవాలి) నెయ్యి: 2tbsp జీడిపప్పు: 1/4cup కుంకుమపువ్వు: చిటికెడు పాలు: 2tbsp 


తయారు చేయు విధానం: -ముందుగా గుడ్లను ఉడికించి పొట్టుతీసి పక్కన పెట్టుకోవాలి. (మీకు ఇష్టమైతన ఉడికించిన గుడ్డును రెండు బాగాలుగా కట్ చేసి పెట్టుకోవచ్చు) .

- గార్నిషింగ్: స్టౌ మీద పాన్ పెట్టిఅందులో నెయ్యి వేసి వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డ్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకూ వేగించుకోవాలి.

- తర్వాత అందులోనే జీడిపప్పు మరియు ద్రాక్ష కూడా వేసి వేగించుకోవాలి.

-తర్వాత ఒక కప్పు వేడి పాల్లో చిటికెడు కుంకుమపువ్వు వేసి వేడి పక్కన పెట్టుకోవాలి.

- మసాల కోసం: మందపాటి గిన్నెలో నెయ్యివేసి, వేడయ్యాక అందులో ఉల్లిపాయ ముక్కలు వేసి లైట్ గా వేగించుకోవాలి. తర్వాత అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి రెండు మూడు నిముషాల వేగించుకోవాలి.

- మసాలకోసం సిద్దంగా పెట్టుకొన్న అన్ని వస్తువులను వేసి 5నిముషాల పాటు తక్కువ మంట మీద వేగించుకోవాలి. 

- తర్వాత అందులోనే ఉడికించిన గుడ్లను కూడా వేసి రెండు నిముషాల వేగించాలి.

- అన్నం: బియ్యాన్ని శుభ్రంగా కడిగి 15నిముషాలు పక్కన పెట్టుకోవాలి.

- ఇప్పుడు మరో పాన్ ను స్టౌ మీద పెట్టి నెయ్యి వేసి అన్నం కోసం సిద్దం చేసుకొన్న మాసాలాలన్నింటిని అందులో వేసి వేగించి అందులోనే నీరు వంపేసి బియ్యాన్ని కూడా వేసి ఒక నిముషం వేగించుకోవాలి

- తర్వాత అందులోనే చికెన్ స్టాక్, ఉప్పు, నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేసి మూత పెట్టి 90%అన్నం ఉడికేంత వరకూ మీడియం మంట మీద ఉడికించుకోవాలి.

- లేయరింగ్: ఇప్పుడు మంద పాటి పాన్ ను స్టౌ మీద పెట్టి అందులో ఎగ్ మరియు మసాలాను మొదటి లేయర్ గా పరవాలి. తర్వాత దీని మీద అన్నంను పరవాలి. అన్నం మీదు నెయ్యిలో వేయించుకొన్న ఉల్లిపాయ, జీడిపప్పు,ద్రాక్షను పరవాలి. ఇలా రెండు మూడు లేయర్లుగా ఒకదాని తర్వాత ఒకటి పరుచుకోవాలి.

- చివరి లేయర్ మీద కుంకుమ పువ్వు నానబెట్టుకొన్న పాలను చిలకరించాలి. తర్వాత దీని మీద అల్యూమినియం సీట్ పరచి మూత పెట్టి తక్కువ మంట మీద 10-15నిముషాలు ఉడికించుకోవాలి. అంతే ఎగ్ దమ్ బిర్యాని రెడీ.

మరింత సమాచారం తెలుసుకోండి: