పెండ్లి కావాలంటే సాధారణంగా జాతక చక్రాలు, వధూ వరుల వయస్సు, కులాలు, గోత్రాలు తదితర అంశాలు చూడటం సర్వసాధారణమైన విషయం. కానీ ఉత్తరాఖండ్లోని ఆల్మోరాలోని చితాయ్ గోలు అమ్మవారి ఆలయంలో మాత్రం ఆధార్కార్డు చూపిస్తేనే పురోహితులు పెండ్లి జరిపిస్తారు. అదేంటి అనుకుంటున్నారా..? అవును ఇక్కడంతేమరి.. ఈ మధ్య కాలంలో ఇక్కడ బాల్య వివాహాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుందట అందుకే ఈ విధానాన్ని తీసుకువచ్చారు పురోహితులు.