తయారీ విధానం: ముందుగా అరటికాయను ముక్కలుగా కోసి పసుపు, ఉప్పు వేసి ఉడికించి పక్కనుంచాలి. బాణెలి లో నూనె వేసి కాగాక ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి వేసి కాసేపు వేయించాలి. ఆ తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చిలను కూడా వేసి ఐదు నిమిషాలపాటు వేయించాలి. ఉప్పు, కారం, ధనియాలపొడి కూడా వేసి కలియబెట్టి చింతపండు రసం, ఉడికించి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని కలిపి బాగా ఉడికించి దించేయాలి.
అంతే వేడి వేడి అరటికాయ పులుసు తయార్.