ఈ మధ్య కాలం లో ఇద్దరు మొగుళ్ళని కట్టుకుని డబ్బుల కోసం వెధవ వేషాలు వేస్తున్న అమ్మాయిలు, డబ్బులు ఎక్కువ అయ్యి ఇద్దరు భార్యలని మైంటైన్ చెయ్యాలి అనే ఫీలింగ్ తో కనపడుతున్న అబ్బాయిలు బాగా కనిపిస్తున్నారు.


హైదరాబాద్ సంతోష్ నగర్ లో ఇలాంటి ఒక వ్యక్తి పోలీసులకి అడ్డంగా దొరికాడు. భార్య పిల్లలతో సంతోష్ నగర్ లో ఉంటున్న ఒక బిజినెస్ మ్యాన్ అన్వర్ మొదటి భార్యకి తెలీకుండా రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్దమయ్యాడు.


ఈమెకి పల్లెత్తు మాట కూడా చెప్పకుండా రెండో పెళ్ళికి సంబందించిన కార్యక్రమం అంతా పూర్తి చేసాడు. సరిగ్గా నిక్కా రోజు విషయం తెలుసుకుని పెళ్లి మండపానికి పరిగెత్తింది మొదటి భార్య.


ప్రేమించి పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలని కన్న తరవాత కూడా తనని ఎందుకు మోసం చేస్తున్నావు అంటూ ప్రశ్నించింది. ఇద్దరూ మత పెద్దల సమక్షం లోనే తీవ్రంగా కొట్టుకున్నారు కూడా.  దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పోలీసులను చూసిన అన్వర్ పలాయనం చిత్తగించాడు. అతనిపై చర్యలు తీసుకోవాలని మొదటి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పరారైన అన్వర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: