మొలకెత్తిన గింజలు – రెండు టేబుల్ స్పూన్లు, పెరుగు. తయారుచేయు విధానం: ఒక గిన్నెలోకి గోధుమపిండి, సోయాపిండి, రాగిపిండి, శెనగపిండి, అవిసలు, పాలకూర తురుము, క్యారెట్ తురుము, గరం మసాలా, ఉప్పు, నూనె వేసి కొద్దిగా నీళ్లు పోసి చపాతిపిండిలా కలుపుకోవాలి.
ఒక అరగంట నానిన తర్వాత చపాతీలు ఒత్తుకుని పెనంపై కాల్చుకోవాలి. పెరుగులో మొలకెత్తిన గింజలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కొద్దిగా ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలి. అన్ని రకాల పిండితో చేసిన ఈ రెయిన్బో చపాతీలను పెరుగులో నంజుకుని తింటే చాలా రుచిగా ఉంటాయి.