తయారీ చేయు విధానం : బాణలీలలో బొంబాయి రవ్వ వేయించాలి (నూనె అవసరం లేదు) ఒక పాత్రలో యాభై గ్రాములు నియ్యివేసి, జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి తిప్పుతూ వుండాలి. ఇవన్నీ బాగా వేగిన తరువాత కరివేపాకు దూసి వేయాలి. చాలామంది ఈ సమయంలో నీళ్లు పోస్తారు. కానీ ఇక్కడ పాలు పోయాలి.
మరుగుతూ పెళపెళలాడుతూ వుండగా గుడ్లను ముక్కలుగా కోసి అందులో వేయాలి. కొంచెం సేపు మరిగిన తర్వాత బొంబాయి రవ్వ వేస్తూ కలుపుతూ ఉండాలి. బాగా మగ్గిన తరువాత కొత్తిమీర వేసి దింపెస్తే బ్రహ్మాండంగా ఉంటుంది.