బియ్యం : పావు కప్పు
ఓట్స్ : కప్పు
బీన్స్ : పది
క్యారెట్ : ఒకటి
బంగాళాదుంప : ఒకటి,
ఉల్లిపాయ : ఒకటి
పచ్చిమిర్చి : రెండు
అల్లం : చిన్న ముక్క
కొత్తిమీర తురుము : పావుకప్పు
కిరివేపాకు : రెండు రెమ్మలు
ఆవాలు : టీ స్పూను
మినపప్పు : టీస్పూను
సెనగపప్పు : టీ స్పూను
ఉప్పు : రుచికి సరిపడా
తయారుచేసే విధానం :
కూరగాయాలన్నీ కడిగి పొట్టు తీసి ముక్కలుగా కోసుకోవాలి అల్లం పచ్చిమిర్చి ముద్దలా నూరాలి. బియ్యం కడిగి అరగంట సేపు నాననివ్వాలి. బాణలిలో నూనె వేసి కాగాగ ఆవాలు , మినపప్పు, సెనగపప్పు వేసి వేయించాలి. అవి చిటపటమన్నాక పచ్చిమిర్చి ముద్ద, కూరగాయాల ముక్కలు వేసి వేయించాలి.
ఓ నిమిషం తరవాత కడిగి నానబెట్టిన బియ్యం, ఓట్స్ ఉప్పు వేసి కలపాలి. తరవాత తగినన్ని నీళ్లు పోసి మూత పెట్ ఉడికించాలి. అన్నం ఓట్స్ ఉడికిన తరవాత చివరగా కరివేపాకు, కొత్తిమీర తురుము చల్లి దించాలి
మరింత సమాచారం తెలుసుకోండి: