సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగుతున్న హీరోయిన్ శృతిహాసన్. శృతిహాసన్ గత కొంత కాలంగా బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఫోకస్ చేసింది. అక్కడ సక్సెస్ కావడంతో తన సొంత గడ్డ కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఇప్పుడు టార్గెట్ చేసుకుంది. ఎందుకంటే శృతిహాసన్ కి భారీ డిమాండ్ ఉన్నప్పటికీ ఇప్పటి వరకూ కోలీవుడ్ లో వరుస మూవీల్లో నటించింది లేదు. ఈ సమయంలో సమంత, తమన్న, అనుష్క లాంటి హీరోయిన్స్ ఇప్పుడు కోలీవుడ్ మార్కెట్ ని కూడ క్యాష్ చేసుకోవటానికి తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదే కంటిన్యూ అయితే శృతిహాసన్ కి కోలీవుడ్ లో మార్కెట్ లో డిమాండ్ తగ్గిపోయో అవకాశం ఉంటుంది. అందుకనే శృతిహాసన్ తాజాగా కోలీవుడ్ మార్కెట్ ని ఫోకస్ చేసుకుంటూ భారీ మూవీలను ఒప్పకుంటుంది. శృతిహాసన్ ఇప్పటి వరకూ కేవలం బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే గ్లామర్ ని చూపించుకుంది. ఏ రకమైన ఎక్స్ పోజింగ్ ని అయినా బిటౌన్ కే పరిమితం చేయటంతో, శృతిహాసన్ అక్కడ సక్సెస్ సాధించింది. ఇప్పడు అదే ఫార్ములాని అప్లై చేస్తుంది. కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అల్ట్రా గ్లామర్ పాత్రలకి గ్రీన్ సిగ్నల్స్ ఇస్తుంది. దీంతో కోలీవుడ్ కి చెందిన నిర్మాతలు శృతిహాసన్ తో మూవీకి సిద్ధంగా ఉంటున్నారు. ఈ విధంగా శృతిహాసన్ తను చేయబోతున్న మూవీలలో ఓ అయిదు భారీ బడ్జెట్ మూవీలు కోలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందినవేగా నిర్ణయాలు తీసుకోవటం కావటం విశేషం. శృతి త్వరలో విజయ్, విశాల్, సూర్య లతో జంటగా నటించనుంది. అలాగే అజిత్ సరసన కూడ శృతిహాసన్ నటించనుంది. అజిత్ సరసన నటించే మూవీలో శృతిహాసన్ రెమ్యునరేషన్ దాదాపు కోటిన్నరూపాయలకు చేరుకుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి శృతిహాసన్ తన స్టార్ డం తో మార్కెట్ రేటుని బాగానే పెంచుకుంటుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: