ప్రపంచ సుందరి ఐశ్వర్యారాయ్ ఆమెకు ఆరాధ్య పుట్టిన తరువాత చాల బొద్దుగా అయి ఇక ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పేస్తుందేమో అనే విధంగా ఆమె రూపం మారిపోయింది. అయితే అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఆమె తన బరువు తగ్గడమే కాకుండా ఒకనాటి ప్రపంచ సుoదరిగా ఎలా మెరిసిందో అలా మెరుపుతీగలా తయారై ఫ్యాషన్ ప్యారెడ్ వేదికల పై వాక్ చేసి ఆదరగోట్టడం చూసిన ఎంతోమంది ఆశ్చర్య పడటమే కాకుండా ఐష్ ను తన గ్లామర్ రహస్యం అడిగితే నవ్వి ఊరుకునేది.  అయితే ఈమధ్య తాను ఇంత అందంగా తాయారు కావడానికి వెనుక ఉన్న సీక్రేట్ ను ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తెలియచేసి అందర్నీ షాక్ చేసింది. ఐశ్వర్య ఇలా మెరుపు తీగలా తయారు కావడానికి గల కారణం ఆమె కూతురు ఆరాధ్య అట. ఆరాధ్య నడవడం మొదలు పెట్టిన తరువాత తమ విశాలమైన భవనంలో పరుగులు తీస్తూ తనను కూడ పరుగులు పెట్టించడంతో తన ఫ్యాట్ అంతా తగ్గి తిరిగి స్లిమ్ గా అయ్యాను అంటూ తన గ్లామర్ సీక్రెట్ ను చెప్పింది ఐశ్వర్య. అంతేకాకుండా వ్యాయామాలు కూడ చేసాను అంటూ చెప్పుకొచ్చింది ఐశ్వర్యరాయ్. ఆరాధ్య పుట్టిన తర్వాత ఐశ్వర్యా రాయ్ అంగీకరించిన తొలి చిత్రం ‘జాజ్బా’ సంజయ్ గుప్తా దర్శకత్వంలో రూపొందపోతున్న విషయం తెలిసిందే. వచ్చేఏడాది జనవరిలో ఈ సినిమా ప్రారంభం అవుతుందని వార్తలు వస్తున్నాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి: