పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టార్ డైరెక్టర్ కి ఝలక్ ఇచ్చాడనే వార్తలు టాలీవుడ్ లో గుప్పుమంటున్నాయి. ఎందుకంటే దర్శకుడు సంపత్ నంది దర్శకత్వం వహించబోతున్న గబ్బర్ సింగ్2 మూవీకి సంబంధించిన లేటెస్ట్ టాక్ లో ఇది బహిర్గతం అవుతుంది. మేటర్ లోకి వెళితే ఇంతకాలం పెండింగ్ లో ఉన్న 'గబ్బర్ సింగ్ 2' త్వరలో సెట్స్ పైకి వెళ్లబోతోంది. అయితే ఈ మూవీని డైరెక్ట్ చేసేది సంపత్ నంది కాదంటూ టాక్స్ నడుస్తున్నాయి. ఇప్పుడు తెరపైకి కొత్త దర్శకుడు వచ్చాడు. తనే పవన్ కళ్యాణ్?.. అవును, పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ 2 మూవీకి దర్శకత్వ బాధ్యతలను తీసుకుంటున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకూ 'గబ్బర్ సింగ్'కు సీక్వెల్ కి దర్శకుడిగా సంపత్ నందినే వర్క్ చేస్తూ వచ్చాడు. దాదాపు రెండేళ్లు గడిచినా ఈ ప్రాజెక్టు షూటింగ్ వరకు వెళ్లలేదు. దాంతో, సంపత్ నంది తను గబ్బర్ సింగ్2 ప్రాజెక్ట్ నుండి తప్పుకుంటున్నట్టుగా గత ఆరు నెలల నుండి చిత్ర యూనిట్ లో తర్జన భర్జనలు జరుగుతున్నాయి. సంపత్ నంది త్వరలోనే హీరో రవితేజతో ఓ సినిమా చేయాలనుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే పవన్ దర్శకత్వ బాధ్యతలు తన భుజాలపై వేసుకున్నట్లు చిత్ర యూనిట్ చెబుతోంది. గబ్బర్ సింగ్2 మూవీకి పవన్ కళ్యాణ్ హీరోగానూ, అలాగే దర్శకత్వ బాధ్యతలను తీసుకుంటున్నట్టుగా తాజాగా వినిపిస్తున్న టాలీవుడ్ టాక్. చిత్ర యూనిట్ చెబుతున్న టాక్స్ ప్రకారం "గబ్బర్ సింగ్2 ప్రాజెక్ట్ కోసం సంపత్ నంది చాలా ఎదురు చూశాడు. ఎంతకీ చిత్రీకరణ ప్రారంభించకపోవడంతో నెక్స్ట్ మూవీకి షిఫ్ట్ అవ్వాలనుకున్నాడు. అందువలన తానే ఈ సినిమాను తెరకెక్కించాలని పవన్ కళ్యాణ్ సర్ భావిస్తున్నారు. ఈ విషయంని త్వరలోనే అఫిషియల్ గా అనౌన్స్ చేసే అవకాశం ఉండొచ్చు" అని చిత్ర యూనిట్ మధ్య జరుగుతున్న సంభాషణ. అలాగే ఇదే మూవీకి పవన్ కళ్యాణ్ కూడ సహ నిర్మాతగా మారే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: