అక్కినేని ఫ్యామిలీ నుంచి వస్తున్న నట వారసుడు అఖిల్‌. అఖిల్ డెబ్యూ మూవీ తాజాగా ప్రారంభమైన విషయం తెలిసిందే. వి.వి.వినాయక్‌ దర్శకత్వంలో అఖిల్‌ తొలి సినిమా పూజ కార్యక్రమాలు డీసెంట్ గా జరిగాయి. పూజా కార్యక్రమాలు పూర్తి కావడంతో, ఈ మూవీకి సంబంధించిన విషయాలు, ఫ్యాన్స్ కే కాకుండా ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ ఆసక్తి రేపుతున్నాయి. అఖిల్‌ చిన్నప్పుడే సిసింద్రీగా ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో రూపొందిన అక్కినేని ఫ్యామిలీ సినిమా ‘మనం’లోనూ కాసేపు కనిపించి అక్కినేని అభిమానులను మెస్మరైజ్‌ చేశాడు. అయితే ఈ చిత్రాన్ని తండ్రి సుధాకర్‌రెడ్డితో కలిసి నితిన్‌ నిర్మిస్తున్నారు. నితిన్ మొదటిసారిగా ఓ బడా మూవీకి నిర్మాతగా మారతున్నాడు. గతంలో తను ఇతర మూవీలకి ఫైనాన్స్ చేసినప్పటికీ అఫిషియల్ గా మాత్రం , అఖిల్ మూవీతోనే తను నిర్మించబోయే బడా మూవీలకు శ్రీకారం చుటాడు. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన ప్రి ప్రొడక్షన్ పనులు అంతా పూర్తి చేసుకున్నాయి. షూటింగ్ షెడ్యూల్స్ కూడ రెడీగా ఉన్నాయి. ఈ మూవీ దాదాపు 30 నుండి 34 కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్క నుందని ఫిల్మ్ ఇండస్ట్రీ వర్గాల నుండి అందుతున్న సమాచారం. ఇంత భారీ బడ్జెట్ మూవీని కేవలం ఓ అక్కినేని డెబ్యూ హీరో కోసం ఖర్చు పెట్టడం అనేది, నిజంగా సాహసమే అంటున్నారు. మూవీకి సంబంధించిన రిజల్ట్ యావరేజ్ అని ఎస్టిమేషన్ వేసుకున్నా, అఖిల్ డెబ్యూ మూవీకి 20 కోట్ల రూపాయలకు మించి బిజినెస్ కాదు. అందుకే నితిన్ ఆలోచించి అఖిల్ డెబ్యూ మూవీకి ఖర్చు పెట్టకపోతే, ఇబ్బందులు తప్పవనే అంటున్నారు. ఈ మూవీకి వెలిగొండ శ్రీనివాస్‌ కథ అందించగా కోన వెంకట్‌ మాటలు సమకూరుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: