త్వరలో సెట్స్ పైకి వెళ్ళ బోతున్న రామ్ చరణ్ శ్రీనువైట్ల కాంబినేషన్ లో బ్రహ్మానందాన్ని దృష్టిలో పెట్టుకుని క్రియేట్ చేసిన పాత్రకు బ్రహ్మీ బదులు కోలీవుడ్ కమెడియన్ సంతానం వచ్చి చేరడం వెనుక పెద్ద కథ నడిచిందని గాసిప్పులు వినపడుతున్నాయి. ఫిలింనగర్ లో వినపడుతున్న వార్తల ప్రకారం శ్రీనువైట్ల బ్రహ్మనందం లేకుండా ఈ కొత్త సినిమాను తీయడానికి సాహసించలేదు అనే టాక్ ఉంది.

శ్రీను వైట్ల గత హిట్ సినిమాలై ‘ఢీ’, ‘రెడీ’, ‘దూకుడు’, ‘బాద్షా’ చితాలు బ్రహ్మానందం వల్లనే హిట్టయ్యాయనే సెంటిమెంట్ శ్రీనువైట్లకు ఉందట. అయితే ఈ కొత్త సినిమాలో క్రెడిట్ మొత్తం రామ్ చరణ్‌కే వచ్చేలా ప్లాన్ చేయాలని, బ్రహ్మానందం పాత్ర నిడివి తగ్గించాలని, వీలైతే బ్రహ్మి లేకుండానే సినిమా తీయమని సూచించారట చిరంజీవి.

అయితే ఈ వార్తలలో ఎన్ని నిజాలో తెలియక పోయినా ఇప్పుడు ఈ వార్తలు టాలీవుడ్ కు హాట్ న్యూస్ గా మారాయి. దీనితో ఈ తలనొప్పి ఎందుకని శ్రీనువైట్ల బ్రహ్మి పాత్రకు సంతానంను ఎంపిక చేసాడు అనే వార్తలు వినిపిస్తున్నాయి.

శ్రీనువైట్ల కామెడీ టచ్ తో పాటుగా ఒక వెరైటీ కథాంశంతో ఈ సినిమా రూపురేఖలను మెగా కాంపౌండ్ పూర్తిగా మార్చి వేస్తోంది అని టాక్. ‘గోవిందుడు అందరివాడేలే’ అనుకున్న విజయాన్ని ఇవ్వకపోవడంతో ఈ సినిమా పై మెగా కాంపౌండ్ చాల శ్రద్ధ పెట్టిందని వార్తలు వినపడుతున్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: