ప్రస్తుతం ఫిల్మ్ ఇండస్ట్రీలో మెగా హీరోల జోరు కొనసాగుతుంది. ఇదిలా ఉంటే మెగా హీరోలు రామ్ చరణ్, అల్లు అర్జున్ ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. ఇక వీరు కాక, కొత్తగా వచ్చిన మోగా హీరోలు సైతం వరుస మూవీలు చేసుకుంటూ, వారి సత్తాని చాటుతున్నారు. ఈ మెగా హీరోలందరకి చిరంజీవి, పవన్ కల్యాణ్ ల ఆశీస్సులు తప్పకుండా లభిస్తున్నాయి.

రీసెంట్ గా అల్లుఅర్జున్ అప్ కమింగ్ మూవీ సన్నాఫ్ సత్యమూర్తి విషయంలో ఇది మరోసారి నిరూపితమైంది. వివరాల్లోకి వెళితే, గత కొద్ది రోజులుగా మెగా ఫ్యామిలీ లో విభేదాలు ఉన్నాయన్న వార్తలకు పవన్ చెక్ పెట్టినట్లు అయ్యింది. అయితే తాజాగా త్రివిక్రమ్ దర్శకత్వం లో అల్లు అర్జున్ నటిస్తున్న S/O సత్యమూర్తి చిత్ర ఆడియో వేడుకకు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజరుకానున్నట్లు సమాచారం.

పవన్ కళ్యాణ్, S/O సత్యమూర్తి మూవీ ఆడియో ఫంక్షన్ కి రావటానికి కారణం, ముఖ్యంగా అల్లుఅర్జున్. గతంలో అల్లుఅర్జున్, తన మూవీలకి పవన్ కళ్యాణ్ రావల్సిందిగా కోరినా, చాలా వరకూ అటువంటి ఆడియో ఫంక్సన్స్ కి దూరంగా ఉంటూ వచ్చాడు. అయితే ఈసారి మాత్రం పవన్ కి అల్లుఅర్జున్ ఫోన్ చేసి, కేవలం 1 నిముషంలో క్లియర్ గా మాట్లాడి, S/O సత్యమూర్తి ఆడియో ఫంక్షన్ రావటానికి ప్రామిస్ తీసుకున్నాడట.

దీంతో అల్లుఅర్జున్ ఫుల్ హ్యపీగా ఉన్నట్టు తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ ఈ మధ్య కాలంలో మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులతో చాలా బాగా కలిసిపోతున్నాడు. ముఖ్యంగా కుర్ర హీరోలతో. ఇదిలా ఉంటే సమంతా, నిత్యామీనన్, అదా శర్మలు అల్లు అర్జున్ సరసన హీరోయిన్ లు నటించగా, దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. మార్చి 8 న ఈ సినిమా కు సంబంధించిన ఆడియో ను విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: