2020 లో మొదటి సరి చంద్రగ్రహణం రాబోతుంది. జ్యోతిషం ప్రకారం ఈ గ్రహణం పునర్వసు నక్షత్రం మిథున రాశిలో ఏర్పడుతుంది. కాబట్టి ఈ రాశివారిపై అధిక ప్రభావం ఉంటుంది. ఈ గ్రహణంతో ఏ రాశి వారికీ ఎలాంటి ప్రభావాలుంటేయో తెలుసుకుందాం... మొదటగా  మేష రాశివారికి గ్రహణం మూడో స్థానంలో సంభవిస్తుంది. ఇది మానవ సంబంధాలను ప్రభావితం చేసే స్థానం. కాబట్టి రక్త సంబంధీకులు, ఇరుగు పొరుగువారితో సంబంధాలపై గ్రహణం ప్రభావం చూపుతుంది. తోబుట్టువుల మధ్య అపార్ధాలు చోటుచేసుకుంటాయి. జరత్తగా ఉండటం మంచిది. రెండవది  వృషభం రాశివారికి గ్రహణం రెండో స్థానంలో సంభవిస్తుంది. ఈ స్థానం ఆర్ధిక, కుటుంబ వ్యవహారాలను ప్రభావితం చేస్తుంది. తొందరపడి నోరుజారితే సమస్యల్లో ఇరుక్కుంటారు. ఆచితూచి మాట్లాడటం ఉత్తమం. 

మూడవది మిథున రాశివారికి గ్రహణం ఒకటో స్థానంలో సంభవిస్తుంది. ఇది ఆరోగ్య సంబంధ అంశాలను ప్రభావితం చేస్తుంది. కాబట్టి ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కొన్ని సార్లు మౌనంగా ఉండటమే ఉత్తమం. కుటుంబ, ఆర్ధిక విషయాలకు ప్రాధాన్యత ఇస్తారు. లక్ష్యాలను చేరుకుని జీవితంలో స్థిరత్వం సిద్ధిస్తుంది. నాలుగవది కర్కాటక రాశివారికి గ్రహణం పన్నెండో స్థానంలో ఏర్పడుతుంది. ఈ స్థానం ఆధ్యాత్మిక అంశాలపై ప్రభావం చూపుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆధునిక జీవనానికి దూరంగా ఉంటారు. కొన్నిసార్లు ఒంటిరితనం ఆవహిస్తుంది. ఐదవది సింహ రాశివారికి గ్రహణం పదకొండో స్థానంలో ఏర్పడుతుంది. జన్మ స్థానాల్లో ఇది పెద్దన్నలాంటింది. స్నేహితులు, పెద్దలతో మాట్లాడేప్పుడు, చర్చల సమయంలో జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే అపార్ధాలు, అపోహలు చోటుచేసుకుంటాయి. ఆరవది కన్య రాశివారికి గ్రహణం పదో స్థానంలో సంభవిస్తుంది. ఇది వృత్తిపరంగా ప్రభావం చూపుతుంది. ఉన్నతాధికారులతో విభేదాలు చోటుచేసుకునే అవకాశం ఉంది. ఎదుటివారితో సంభాషించేటప్పుడు తెలివిగా వ్యవహరించాలి. వృత్తి, ఉద్యోగపరంగా ఎదగడానికి ప్రయత్నిస్తారు.

ఏడవది తుల రాశివారికి గ్రహణం తొమ్మిదో స్థానంలో సంభవిస్తుంది. ఇది దూర ప్రయాణాలు, మతపరమైన అంశాలను ప్రభావితం చేస్తుంది. కాబట్టి దూర ప్రయాణాలలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. ఉద్యోగపరంగా ప్రయాణాలలో అప్రమత్తంగా ఉండాలి. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. ఎనిమిదోవది వృచ్చిక రాశివారికి గ్రహణం ఎనిమిదో స్థానంలో ఏర్పడుతుంది. ఇది ఊహించని ఫలితాలకు కారణమవుతుంది. తల్లిదండ్రుల ఆరోగ్యం కొంత ఆందోళన కలిగిస్తుంది. అలాగే ఉద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. నిజాలను మాట్లాడి సమస్యల్లో చిక్కకుంటారు. తొమ్మిదోవది ధనస్సు రాశివారికి గ్రహణం ఏడో స్థానంలో ఏర్పడుతుంది కాబట్టి ఇది జీవితభాగస్వామితో సంబంధాలను ప్రభావితం చేస్తుంది. కొన్ని విషయాలలో జీవితభాగస్వామి నుంచి మద్దతు కొరవడుతుంది. కాబట్టి సహనంతో పరిస్థితులను ఎదుర్కొడానికి ప్రయత్నించాలి. అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. 

పదవది మకర రాశివారికి గ్రహణం ఆరో స్థానంలో సంభవిస్తుంది. ఇది ఆటంకాలకు మూలం. జీవితభాగస్వామితో సంబంధాలు దెబ్బతినే సూచనలు ఉన్నాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండాలి. వ్యాపారాల్లో భాగస్వాముల నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొన్ని సందర్బాల్లో మౌనంగా ఉండటమే ఉత్తమం. పదకొండవది కుంభ రాశివారికి గ్రహణం ఐదో స్థానంలో సంభవిస్తుంది. కాబట్టి ఇది మానసిక సామర్థ్యం, నేర్చుకునే అంశాలను ప్రభావితం చేస్తుంది. సంబంధాలలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. పిల్లల విషయంలో ఏర్పడిన సమస్యలను మృదువైఖరి పరిష్కారం చూపుతుంది. పన్నెండవది మీన రాశివారికి గ్రహణం నాలుగో స్థానం ఏర్పడుతుంది. ఇది తల్లిస్థానం.. ప్రేమకు ప్రతిరూపం. కొన్ని సందర్భాల్లో అసంతృప్తికి గురవుతారు. తల్లిదండ్రులు ముఖ్యంగా తల్లి ఆరోగ్యం విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కుటుంబసభ్యులతో బంధం మరింత బలపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: