ప్రపంచ స్థాయిలో ఉన్నత ప్రమాణాలు కలిగిన జాగ్వార్ కార్ నుండి ఈ సంవత్సరం ఇండియాలో మరో సరికొత్త కార్ రిలీజ్ అవుతుంది. ఇప్పటికే జాగ్వార్ కార్ సేల్ మన దేశంలో అత్యధికంగా ఉండటం తెలిసిన విషయమే. సంపన్నులు అధికంగా కొనుగోలు చేసే ఈ వాహనం ఇప్పుడు సరికొత్త రూపాంతరాలను సంతరించుకుంది.


జాగ్వార్ నుండి వస్తున్న ఈ సరికొత్త మోడల్ ఎఫ్-టైప్ వెహికల్ గా ప్రఖ్యాతి చెందింది. ప్రపంచంలోనే అత్యంత గొప్ప మిషినరీ విధానంతో తయారు చేయబడ్డ ఈ ఎఫ్-టైప్ వెహికల్ ఈ సంవత్సరమే ఇండియాలో తమ ఉత్పత్తులను అందించేందుకు రెడీ అవుతుంది. మొన్నటిదాకా జెనెవా మోటర్స్ ద్వారా అందుబాటులో ఉన్న ఈ వెహికల్స్ ఇప్పుడు నేరుగా మార్కెట్ లోకి రిలీజ్ అవుతున్నాయి.


5.0 లీటర్ సూపర్ చార్జెడ్ పవర్ సిస్టెంతో.. 567 బి.హెచ్.పి, 700 ఎన్.ఎం పవర్ సామర్ధ్యం గల టార్చ్ తో ఈ వెహికల్ యొక్క ఫోర్ వీల్స్ అధునాతనంగా రూపొందించబడ్డాయి. ఇక ఇంజిన్ అయితే మొట్టమొదటి సారి మోస్ట్ అడ్వాన్సెడ్ టెక్నాలజీ సిస్టెంతో తయారు చేయబడ్డది.      


ఇక ఈ సరికొత్త జాగ్వార్ ఎఫ్-టైప్ వెహికల్ రిలీజ్ ఎనౌన్స్ మెంట్ త్వరలోనే మనం చూడబోతున్నామన్నమాట. ఇక ఈ వెహికల్ అన్ని జాగ్వార్ డీలర్స్ దగ్గర అందుబాటులో ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం లక్సరీ కార్ కొనాలని ఎదురుచూస్తున్న మీకు రాబోయే జాగ్వార్ ఎఫ్-టైప్ వెహికల్ సరికొత్త అనుభూతిని ఇస్తుంది అనడంలో సందేహం లేదు. 


మరింత సమాచారం తెలుసుకోండి: