దేశంలో అత్యంత సౌకర్యవంతంగా ఉండే వాహనాలలో బి.ఎం.డబల్యు ఒకటి. అయితే కస్టమర్స్ యొక్క ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని తమ ఉత్పత్తులను మెరుగు పరచుకుని మార్కెట్ మీద మరింత గ్రిప్ పెంచుకునే ప్రయత్నం చేస్తుంటాయి వాహన కంపెనీలు. ఇప్పుడు ఆ దారిలోనే లక్స్రియస్ కార్లలో ఒకటిగా పేరు తెచ్చుకున్న బి.ఎం.డబల్యు ఇప్పుడు మరో ముందడుగేసి 5 సీరీస్ పెట్రోల్ కార్లను లాంచ్ చేస్తుంది. 


కేవలం పెట్రోల్ తో నడిచే ఈ ఇంజిన్ లు మరింత సౌకార్యవంతంగా ఉంటాయి. వీటి ధర 54 లక్షల నుండి ఉన్నాయి. ఇక వాహన స్టార్ట్ అయిన 8 సెకన్లలోనే 0 నుండి 100 కిలోమీటర్ల స్పీడ్ ను అందుకునే సామర్ధ్యం ఉంది ఈ వాహనానికి. అసలైతే బి.ఎం.డబల్యు యొక్క విశిష్టతే అది అతి తక్కువ పికప్ టైంలో జోరుగా ప్రయాణం సాగించవచ్చు.


అయితే ఈ 5 సీరీస్ బి.ఎం.డబల్యు కార్లు 2014 నుండ్ అందుబాటులో ఉన్నాయి.. కాని ఇప్పటిదాకా కేవలం డీజిల్ తో నడిచే వాహనాలతోనే రిలీజ్ చేశాయి. కాని ఇప్పుడు పెట్రోల్ ఇంజిన్స్ కూడా లాంచ్ చేశారు బి.ఎం.డబల్యు కంపెనీ వారు. మరి ఈ కొత్త కార్లతో మార్కెట్ లో మరింత పటిష్టంగా తయారయ్యింది కంపెనీ.  



మరింత సమాచారం తెలుసుకోండి: