నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ 3 టాప్ రేటింగ్స్ తో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతుంది. ఈ షోకి నాగార్జున తన యాంకరింగ్ తో  మాజిక్ చేస్తున్నాడు. ఎన్నో టాస్క్ లు... మరి నువ్వు ట్విస్టులు... ఇంకెన్నో పోట్లాటలు ఇలా వీటన్నిటితో బిగ్ బాస్ 3 పోరు రసవత్తరంగా సాగుతుంది. వంద రోజులు కొనసాగే బిగ్ బాస్ షో... ఇప్పటికే 60 రోజులు పూర్తి అయిపోయింది. ఈ 60 రోజుల్లో ఎలిమినేషన్ లు, వైల్డ్ కార్డ్ ఎంట్రీ లు ఇలా బిగ్ బాస్ ఇంట్రెస్టింగ్ గా అందరినీ ఆకర్షిస్తుంది.

 

అయితే రెండు వారాల కిందట బిగ్ బాస్ లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా ప్రవేశించిన శిల్ప చక్రవర్తి.... ఒక వారంలోనే బిగ్ బాస్ నుండి ఎలిమినేట్ అయింది. అయితే శిల్ప చక్రవర్తి బయటికి వచ్చిన తర్వాత బిగ్ బాస్ 3 హౌస్ కి సంబంధించి తాజా ఇంటర్వ్యూలో కొన్ని విషయాలను పంచుకుంది. బిగ్ బాస్3 హౌస్ లోకి ప్రవేశించినప్పటినుంచి తాను  అందరితో పాజిటివ్ గానే ఉన్నాను అని శిల్ప చక్రవర్తి తెలిపింది. అయితే తను ఎలిమినేట్ అయిన తర్వాత బయటకి వచ్చే ముందు హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికీ కొన్ని బిరుదులు ఇచ్చానని తెలిపింది. అయితే వాళ్ళకి ఇచ్చిన బిరుదులు అన్నీ పాజిటివ్ వే  లోనే ఇచ్చానని... నెగిటివ్ చెప్పాలనుకుంటే చాలానే ఉన్నాయని తెలిపింది. కానీ తనకు  నెగటివ్ చెప్పే ఉద్దేశ్యం లేదు కాబట్టే.. పాజిటివ్ మాత్రమే చెప్పానని తెలిపింది. కానీ బయటకి వచ్చాక తనకు  ఒక వీడియో ప్లే చేసి చూపించారని. ఆ వీడియోలో  శ్రీముఖి మాట్లాడిన మాటలు తనకు  చాలా ఆశ్చర్యాన్ని కలిగించాయి అని శిల్ప చక్రవర్తి తెలిపింది. శ్రీముఖి తనకి  ఎక్కువగా పరిచయం లేదని... శ్రీముఖి ని ఎక్కువగా టీవీలోని చూశానని శిల్ప చక్రవర్తి తెలిపింది. "శిల్ప గారికి చాలా చరిత్ర ఉంది నేనంటే శిల్పాకు పడదు" అని శ్రీముఖి అనడంతో ఆమే  షాక్కి గురయ్యానని  తెలిపింది. అది విన్న వాళ్లు నిజమేనని నమ్మి తన  మీద చెడు ప్రభావం పడే అవకాశం ఉందని... దానివల్లె  తన  ఓటింగ్ కూడా తగ్గవచ్చని అభిప్రాయపడింది. అయితే బయటికి వచ్చిన తర్వాత శ్రీముఖుని ఈ విషయం గురించి అడగాలి అనుకుంటున్నానని శిల్ప చక్రవర్తి తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: