మారుతి సుజుకి కార్లు మరోసార్ దేశీయ మార్కెట్ లో తమ సత్తా చాటాయి. అక్టోబర్ నెలలో ఏకంగా 1,53,000 యూనిట్ కార్లను అమ్మి మారుతి సుజుకి బ్రాండ్ వాల్యూ ఏంటో చాటిచెప్పింది. అక్టోబర్ నెలలో దేశీయ మార్కెట్ లో 1.41 లక్షల కారు అమ్మగా విదేశాల్లో మిగిలిన వాటిని ఎక్స్ పోర్ట్ చేసింది.


మారుతి సుజుకి కార్లలో బ్రిజా, ఎర్టిగా ఎం.పి.వి, ఎక్స్ ఎల్ 6 ప్రీమియం ఎం.పి.వి వెహికల్ సేల్స్ బాగున్నాయి. వీటితో పాటుగా ఎస్ క్రాస్ వెహికల్ సేల్స్ కూడా భారీగా ఉన్నాయి. దసరా దీపావళి రెండు పండుగలు ఒకే నెలలో రావడం వల్ల మారుతి సేల్స్ లో పుంజుకుంది. ముఖ్యంగా దీపావళి రోజున సేల్స్ బాగున్నాయని తెలుస్తుంది.


వీటికి తోడుగా పండుగ సీజన్ లో కస్టమర్స్ కు ఆకర్షణీయమైన ఆఫర్లు కూడా ఈ సేల్స్ పెరిగేందుకు కృషి చేశాయి. ఈ పండుగ వేల మారుతి సుజుకి హ్యాచ్ బ్యాక్ వెహికల్ అల్టో కె 10 వెహికల్ పది వేల యూనిట్స్ అమ్ముడవడం కూడా విశేషం. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: