దేశంలో.. రాష్ట్రంలో.. సంచలనం సృష్టించిన సంఘటన ఇటీవల అబ్దుల్లాపూర్ మెట్ ఎమ్మార్వో విజయారెడ్డి హత్య అందరికి తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడు సురేశ్‌ చికిత్స పొందుతూ.. గురువారం మృతి చెందిన విషయం తెలిసిందే. ఉస్మానియా డాక్టర్లు పోస్ట్‌మార్టం చేసి మృత దేహాన్ని ఆయన స్వస్థలానికి తరలించారు. ఈ విషయమై నిందితుడి తండ్రి కృష్ణ కుమారుడు సురేష్‌ మృతిపై స్పందించారు. 
సురేష్ తండ్రి కృష్ణ మాట్లాడుతూ.. కొడుకు మరణం తీవ్రంగా బాధించిందన్నారు. అసలు నా కొడుకు ఎప్పుడు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్ళలేదని, తహసీల్దార్‌ను ఎందుకు హత్య చేశాడో తెలీదన్నారు. తమకు చెందిన తొమ్మిది గుంటల భూమిని ఏడాది క్రితం మల్‌రెడ్డి రంగారెడ్డికి అమ్మినట్లు ఆయన తెలిపారు. మొత్తం 7ఎకరాల భూమి తమ అన్నదమ్ములకు చెందిందని, అయితే భూ సమస్య నిమిత్తం తానే తహసిల్దార్‌ ఆఫీసు, కోర్టు చుట్టూ తిరుగుతున్నట్లు కృష్ణ తెలిపారు. ఈరోజు రాత్రి అంత్యక్రియలను పూర్తి చేస్తామని పేర్కొన్నారు.
ఈసీజీలో పల్స్‌ రేటు ఫ్లాట్‌గా రావడంతో మధ్యాహ్నం మూడు గంటల 30 నిమిషాలకు వెంటిలేటర్‌ తొలగించినట్లు పేర్కొన్నారు. కాగా వివాదాస్పద భూమికి సంబంధించి తనకు పట్టా ఇవ్వలేదనే కోపంతోనే ఎమ్మార్వోను సజీవ దహనం చేసినట్లు నిందితుడు సురేశ్‌ వాంగ్మూలం ఇచ్చాడు. ఎమ్మార్వోను ఎంతగా బతిమిలాడినా ఆమె తనకు పట్టా ఇవ్వలేదని సురేశ్‌ పేర్కొన్నాడు. 
దీంతో విసిగిపోయిన సురేష్ సోమవారం మధ్యాహ్నం ఆమె కార్యాలయానికి వెళ్లి మరోసారి విఙ్ఞప్తి చేశానని.. అయినప్పటికీ ఆమె స్పందించలేదని తెలిపాడు. ఈ క్రమంలో మరోసారి తిరిగి పెట్రోల్‌ డబ్బాతో ఎమ్మార్వో కార్యాలయానికి వెళ్లి.. మొదట తనపై కిరోసిన్‌ పోసుకుని.. తర్వాత ఆమెపై పోసినట్లు వెల్లడించాడు. ఇక ఈ ఘటనలో విజయారెడ్డిని రక్షించేందుకు వెళ్లిన ఆమె డ్రైవర్‌ కామళ్ల గురునాథం కూడా మృతి చెందిన విషయం తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: