సమాజంలో పరిస్థితులను చూస్తే.. డబ్బు ఎంత ముఖ్యమో అర్ధమవుతుంది. డబ్బుకోసం  ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కష్టపడే  కొంత మందైతే.. ప్రాణం తీసైనా డబ్బుసంపాదించాలకునే వారు మరికొంతమంది ఉన్నారు. కాని డబ్బుకోసం కన్నకొడుకుని కిడ్నాప్ చేసిన ఘటున గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఆరేళ్ళ బాలుడిని కన్నతండ్రే డబ్బుకోసం కిడ్నాప్ డ్రామా ఆడిన ఘటన ఇప్పుడు స్థానికంగా సంచనంగా మారింది.

 

వివారాల్లోకి వెళితే.. తాడేపల్లిలోని అమర్ రెడ్డి కాలనీలో భార్య భర్తలు తమ ఆరేళ్ల కొడుకు పార్ధసారధితో కలిసి నివసిస్తున్నారు. ప్రతీ రోజులానే బుధవారం ఉదయం పిల్లాడు స్కూల్ కి వెళ్లాడు. కాని సాయంత్రం అయినా ఇంటికి తరిగిరాలేదు. పిల్లాడి తండ్రి శ్రీనివాసరావుకు శ్యాముల్, అబ్రహమ్ అనే ఇద్దరు స్నేహితులు ఉన్నారు. ఇలా కిడ్నాప్ ప్లాన్ వస్తే డబ్బు వస్తుదని శ్రీనినాస్ కు మాయమాటలు చెప్పి స్కూల్ నుంచి బాలుడిని కిడ్నాప్ చేసినట్లు తల్లి తెలిపింది.

 

ఆతువాత బాలుడి తల్లికి  ఫోన్ చేసి 5లక్షలు కావాలని డిమాండ్ చేసారు. లేదంటే బాలుడిని ఏమైనా చేస్తామని బెదిరించారు. దీంతో తల్లి భయపడి పోలీసులకు తన భర్త పై ఫిర్యాదు  చేసింది.  దీంతో పోలీసులు రంగంలోకి దిగి నిందితుడికోసం గాలింపు చర్యలు ప్రారంభిచారు. 

 

ఈ ఫిర్యాదుతో అప్రమత్తమైన స్ధానిక పోలీసులు బాలుడి తండ్రిని అదుపుతో తీసుకున్నారు. పోలీసుల విచారణలో  కిడ్నాప్ కు గురైన  బాలుడుతో నిందితులు గుంటూరు పరిసర ప్రాంతాలలో సంచరిస్తున్నట్లు సమాచారం తెలిసింది. దీంతో అలెర్ట్ అయిన పోలీసు అధికారులు నిందితుల కోసం పట్టణ పరిసర ప్రాంతాల్లో  విస్తృత తనిఖీలు చేపట్టారు.

 

తన భర్త తాగుడికి అలావాటు పడి ఇంతకు తెగించాడని..బాలుడి తల్లి ఆవేదన వ్యక్తంచేసింది. త్వరగా తన కొడుకుని కాపాడాల్సిందిగా పోలీసులను వేడుకుంది.  డబ్బు మనుషుతో ఎంత పనైనా చేయిస్తుందనడానికి ఇది ఒక ఉదాహరణ. 

మరింత సమాచారం తెలుసుకోండి: