భారతదేశంలో ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు భారీగా పెరిగిపోయాయి. ద్విచక్ర వాహన రంగంలో అయితే మరీ ఎక్కువగా అమ్ముడు పోతున్నాయి. అందుకే రోజు రోజుకి భారత్ మార్కెట్లోకి కొత్త కొత్త వాహనాలు వస్తున్నాయి. ఆలా వచ్చిన వాహనాలలో బజాజ్ చేతక్ కూడా ఒకటి. 

 

బజాజ్ నుండి విడుదలైన మొట్ట మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్.. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్. బజాజ్ ఆటో ఇండియా తన మొట్టమొదటి ఆల్-ఎలక్ట్రిక్ స్కూటర్‌ను భారతీయ మార్కెట్లో పరిచయం చేయనుంది. బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ 2020 జనవరి 15 అంటే ఈరోజు నుండి భారత మార్కెట్లోకి అందుబాటులో ఉండనుంది. అయితే ఈ బండి దేశంలోని ఇతర ప్రాంతాలలో విస్తరించే ముందు కేవలం ఐదు నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉండనుంది. 

 

ఆ ఐదు నగరాలు బెంగళూరు, పూణే, ముంబై, ఢిల్లీ చెన్నై నగరాలు మాత్రమే. ఆల్ ఎలక్ట్రిక్ బజాజ్ చేతక్ కోసం బుకింగ్ ఈరోజు ప్రారంభమయ్యింది. ఈ స్కూటర్ కొనుగోలు చేయాలని భావించే వారు బుకింగ్ చేసుకోవచ్చు. రూ.2,000తో స్కూటర్‌ను బుకింగ్ చేసుకోవచ్చు. ఈ బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ.1.10 లక్షల వరకు ఉంటుందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. మరి ఈ బండి ఎంతమాత్రం వాహన ప్రియులను ఆకట్టుకుంటుందో చూడాలి. కాగా ఈ కొత్త చేతక్ వాహనాన్ని ఎంత ఇష్టపడిన సరే.. మధ్య తరగతి  వారు కొనలేరు. కారణం.. ఈ చేతక్ బండి ధర అంత ఉంది.. మరి ఈ కొత్త వాహనం అమ్మకాలు ఏ మాత్రం సాగుతాయో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: