ఈకాలం అబ్బాయిలకు బండి లేకపోతే కాలు బయటకు పెట్టాలి అనిపించదు.. అయితే కొంచం రిచ్ ఉన్నవారు అయితే అది ఇది అని అనవసర బైక్ లకు లక్షలు లక్షలు తగలేస్తారు.. అదేం అంటే స్టైల్ అంటారు. ఆలా డబ్బుని వృధా చెయ్యడం కూడా వారికీ మహా ఇష్టం అయితే.. మధ్య తరగతి వారు ఆలా కాదు.. 

 

ఎంత ఇష్టం ఉన్న.. వారి స్థాయి బండిలే కొనడానికి ప్రయత్నిస్తారు. అయితే ఇప్పడు ఏదో తక్కువ చేస్తున్నట్టు కాదు.. మన మధ్య తరగతి గొప్పతనం గురించి నాకు వచ్చినట్టు చెప్తున్నా. అయితే మన మధ్యతరగతి వారికీ నచ్చేలా.. అన్ని ఫిచర్లతో బైక్ సిద్ధం అయ్యింది. ఆ బైక్ చూస్తే వావ్ అనాల్సిందే.. 

 

అంత అద్భుతంగా బైక్ ఉంది. అతి తక్కువ ధరకే.. అంటే మధ్యతరగతి వారు కొని విధంగానే బైక్ ధర ఉంది. ఎంత అనుకుంటున్నారా? కేవలం రూ. 93,500 ప్రారంభ ధరతో టీవీఎస్ మోటార్ కంపెనీ 2020 బిఎస్-6 అపాచీ ఆర్టీఆర్ 160 ని భారత్ మార్కెట్లో ఈ బైక్ ను విడుదల చేసింది. దీంతో ఈ బండి మధ్యతరగతి వారికీ అతి తక్కువ ధరలోనే దొరుకుతుంది. 

 

 ఈ టీవీఎస్ అపాచీలో .. క్లీనర్ పవర్ ప్లాంట్‌తో పాటు కొత్త బాడీ గ్రాఫిక్స్ మరియు ఫ్యూయల్-ఇంజెక్షన్ వ్యవస్థ కలిగి ఉంటుంది. 
2020 అపాచీ 4 వి శ్రేణి మోడల్ లనే ఆర్టిఆర్ 160 2వి సెగ్మెంట్-ఫస్ట్ గ్లైడ్ టెక్నాలజీ కలిగి ఉంది. కాగా ఈ టీవీఎస్ అపాచీ ఆరు రంగులతో మన ముందుకు రానుంది.. యువతను ఆకట్టుకునే విధంగా ఈ బైక్ రూపొందింది. 


 

మరింత సమాచారం తెలుసుకోండి: