భారత్ లో ఇప్పటికే ఖరీదైన బైకులు చాల ఉన్నాయి.. ఆ బైకులే ఎవరు కొనలేకపోతున్నారు. అలాంటిది ఇప్పుడు మరో అత్యంత ఖరీదైన బైక్ వస్తుంది. ఆ బైక్ ఏంటి అనుకుంటున్నారా? అదేనండి హోండా ఫోర్జా 300. అయితే ఈ బండి ఈ సంవత్సరం రావడం లేదు.. అసలు వచ్చేలా కూడా లేదు. 

 

ఈ వాహనాన్ని వచ్చే ఏడాది విడుదల చేయనున్నట్లు హోండా మోటార్ సైకిల్ సేల్స్ అండ్ మార్కెటింగ్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ యద్విందర్ సింగ్ గులేరియా తెలిపారు. అయితే ఈ ఫోర్జా 300 బైక్ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని వినియోగదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాంటి ఈ సమయంలో ఈ బైక్ మరింత ఆలస్యం అవుతుంది అని చెప్పడం కొంచం బాధాకరమైన విషయమే. 

 

అయితే బీఎస్4 వర్షన్ ఇంకొక నెలల ముగివ్వడంతో హోండా ఫోర్జా 300 స్కూటర్ బీఎస్6 వర్షన్ ను వచ్చే ఏడాది విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.ఈ హోండా ఫోర్జా 300 ధర భారత్ లోనే అత్యంత ఖరీదైనది.. ఎంత అనుకుంటున్నారా? రూ.4.65 లక్షలు. భవిష్యేత్తులో 5 లక్షల వరుకు ఉండే అవకాశం ఉంది. అయితే ఈ బైక్ కు మధ్యతరగతి వారు ఖచ్చితంగా దూరంగా ఉంటారు.. ఎందుకంటే ఇది మధ్యతరగతి బైక్ కాదు కాబట్టి. 

మరింత సమాచారం తెలుసుకోండి: