భారత్ లో టీవీఎస్ స్కూటర్లు మంచి విక్రయాలు అందుకుంటున్నాయి. ఇప్పటికే ఎన్నో రకాల స్కూటీలను తీసుకొచ్చిన టీవీఎస్ ఇప్పుడు ఏ సంస్ద తన సరికొత్త స్కూటర్ ను భారత్ మార్కెట్ లోకి లాంచ్ చేయనుంది. 

 

బీఎస్6 కాలుష్య నియంత్రణ ప్రమాణాలకు అనుగుణంగా టీవీఎస్ స్కూటీ పెప్ ప్లస్ మోడల్ ను మార్పులు చేసింది టీవీఎస్ సంస్ద. ఇక ఈ బండి ధరలు కూడా అతి తక్కువ కే వస్తున్నాయ్. ఎక్స్ షోరూంలో ఈ బైక్ ధర రూ.51,574లుగా సంస్థ నిర్దేశించింది. బీఎస్4 స్కూటర్ తో పోలిస్తే ఈ సరికొత్త స్కూటీ ధరను 6,400 పెంచింది. అయితే ప్రస్తుతం ఉన్న బీఎస్ 4 వాహనాలతో పోలిస్తే అతి తక్కువ ధరకే లభిస్తుంది. 

 

ఈ సరికొత్త టీవీఎస్ స్కూటర్ మూడు వేరియంట్లలో దొరుకుతుంది.. స్కూటీ పెప్ ప్లస్ సిరీస్, బేబ్లీసియస్ సిరీస్, మ్యాటీ ఎడిషన్ సిరీస్ అనే మూడు వేరియంట్లలో ఈ స్కూటర్ లభిస్తుంది. అయితే ఆ స్కూటర్ ధరలు ఇలా ఉన్నాయి. స్కూటీ పెప్ ప్లస్ సిరీస్ బీఎస్6 వేరియంట్ ధర రూ.51,574గా నిర్ణయించారు. 

 

బేబ్లీసియోస్ సిరీస్ బీఎస్6 వేరియంట్ ధర రూ.52,954గా నిర్ణయించారు. మ్యాటీ ఎడిషన్ సిరీస్ బీఎస్6 వేరియంట్ ధర రూ.52,954గా నిర్ణయించారు. ఇక ఈ స్కూటర్లను బీఎస్6 ప్రమాణాలకు అనుగుణంగా మార్పులు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: