దేశంలో కరోనా విజృభిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే కరోనా నియంత్రణకు విధించిన లాక్ డౌన్ విధించిన సంగతి అందరికి విదితమే. లాక్ డౌన్ తో దాదాపు రెండు నెలలు ఉత్పత్తికి, అమ్మకాలకూ దూరమైన దేశీయ ఆటోమొబైల్ పరిశ్రమ. మే నెలాఖర్లో అంతంతమాత్రపు విక్రయాలతో సరిపెట్టుకున్నదన్నారు. గత నెలలో తిరిగి ఉత్పత్తిని ఆరంభించిన సంస్థలు. ఈ నెలలో మార్కెట్ లోకి కొత్త మోడల్స్ కార్లను పరిచయం చేసేందుకు సిద్ధమవుతున్నాయని తెలిపారు.
అయితే మారుతీ, హ్యుండాయ్, హోండా, ఎంజీ మోటర్ సంస్థలు నూతన కార్లను తీసుకొస్తున్నాయని నిపుణులు తెలిపారు. బీఎస్-6 ప్రమాణాలతో 1.5 లీటర్ ఫోర్ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్తో ఇది విపణిలోకి రాబోతున్నదన్నారు. ఎస్-క్రాస్ కోసం మారుతి తొలిసారిగా ఏ 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్, ఫోర్ స్పీడ్ టర్క్యూ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్బాక్స్లను వినియోగిస్తున్నదన్నారు. అయితే దక్షిణ కొరియా ఆటోమేజర్ హ్యుండాయ్ గత ఫిబ్రవరిలో ఆటో ఎక్స్పోలో ఆవిష్కరించిన టక్సన్ అప్ డేట్ మోడల్ను మార్కెట్లోకి ప్రవేశపెడుతున్నదన్నారు. మిడ్ - లైఫ్ ఫేస్ లిఫ్ట్ తో దీన్ని తెస్తున్నారు. 2.0 లీటర్ టర్బో డీజిల్, పెట్రోల్ ఇంజిన్ల సామర్థ్యంతో రానున్న ఈ కారులో సరికొత్త టచ్ స్క్రీన్ తో కొత్త డ్యాష్ బోర్డును పెట్టారని యాజమాన్యం తెలిపారు.
అయితే హోండా కార్స్ గత నెల కొత్త అవతారంలో తమ పాపులర్ మోడల్ ‘సిటీ’ని ఆవిష్కరించిన సంగతి విదితమే. అయితే దానికి అప్ డేట్ మోడల్ ను ఈ నెలలో తీసుకురానున్నది. ప్రస్తుత మోడల్ తో పోల్చితే రాబోయే మోడల్ బహిర్గతంగా, అంతర్గతంగా మరిన్ని హంగులతో కనిపించనున్నదన్నారు. వచ్చే నెలలో డెలివరీ ప్రారంభం కానున్న జర్మనీ ఆటోమేకర్ ఆడీ 2020 ఆర్ఎస్7 స్పోర్ట్ బ్యాక్ కారు బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి. రూ.10 లక్షల విలువ గల ఈ కారు 8స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్తో 4.0 లీటర్లు, టీఎఫ్ఎస్ఐ వీ8 ట్విన్ టర్బో పెట్రోల్ సామర్థ్యంతో అందుబాటులోకి వస్తుందన్నారు.