మార్కెట్ లో ఎన్ని వెహికల్స్ ఉన్నా మహింద్రాను తలదన్నే వాహనాలు లేవనే చెప్పాలి. ఎప్పటికప్పుడు సరికొత్త టెక్నాలజీతో కస్టమర్స్ ను ఎట్రాక్ట్ చేస్తున్న మహింద్రా అండ్ మహింద్రా కంపెనీ ఈరోజు 70వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా టియువి 300 మోడల్ కొత్త కలర్ ను ఇంట్రడ్యూస్ చేసింది. బ్రోంజ్ గ్రీన్ కలరింగ్ తో వస్తున్న ఈ వెహికల్ కావాలనుకున్న వారు ముందు ఆర్డర్ పెడితే వస్తుంది.


ఇక ఈరోజు ఇండెపెండెన్స్ డే సందర్భంగా ప్రవేశ పెడుతున్న ఈ మోడల్ కు అధిక ధర కూడా వెల కట్టడం లేదట. ఇదవరకు ఉన్న మోడల్స్ కు ఎంత ప్రైజ్ ఉందో అదే ప్రైజ్ తో ఈ కొత్త కలర్ ను సొంతం చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఇది ఓ విధంగా గొప్ప అవకాశం అని చెప్పాలి. 


మహింద్రా వెహికల్స్ ను పూర్తి స్థాయి నమ్మకంతో కొనే కస్టమర్స్ చాలామంది ఉంటారు. ఏళ్ల తరబడి కపెనీ విశ్వాసం కస్టమర్స్ లో ఉండింది. అందుకే వారి అంచనాలకు అనుగుణంగా సాంకేతికంగా కూడా మహింద్రా వేరే వాటికన్నా ఎప్పుడు ముందంజలో ఉండసాగింది.  



మరింత సమాచారం తెలుసుకోండి: