హీరో మోటో కార్ప్ నుండి వచ్చిన కరిజ్మా బైక్ టూ వీలర్ రంగంలో ఎంత ప్రాముఖ్యత సంతరించుకుందో తెలిసిందే. హీరో కరిజ్మా యూత్ ను బాగా ఆకట్టుకుంది. అయితే విదేశీ స్పోర్ట్స్ బైకుల మోజులో పడి కరిజ్మాను పట్టించుకోకపోవడంతో హీరో కూడా దాని మ్యానిఫ్యాక్చరింగ్ ఆపేసింది. అయితే మార్కెట్ లో వచ్చిన గణనీయమైన మార్పుల కారణంగా హీరో మోటో కార్ప్ మళ్లీ కరిజ్మా బైక్ ను కొత్త అప్డేట్స్ తో రిలీజ్ చేయాలని చూస్తుంది.


హీరో నుండి 200 సిసి బైక్ గా ఎక్స్ ట్రీం బైక్ వచ్చింది. ఇక ఇప్పుడు అదే 200 సిసి సామర్ధ్యంతో కరిజ్మా న్యూ వెర్షన్ లాంచింగ్ కు రంగం సిద్ధం అవుతుంది. బ్రాండ్ వాల్యూస్ పడిపోతుందని భవించి కరిజ్మా మార్కెట్ ను ఆపేయగా హీరో అఫిషియల్ వెబ్ సైట్ లో మాత్రం కెరిజ్మా జెడ్.ఎమ్మార్ బైక్ ను అలానే ఉంచారు. ప్రస్తుతం పోటీగా వస్తున్న దేశీయ, విదేశీ బైకులను దృష్టిలో ఉంచుకుని సరికొత్త అప్డేట్స్ తో కరిజ్మా బైక్ రీ లాంచ్ చేస్తున్నారట. అయితే కరిజ్మా కావాలనుకునే వారు మాత్రం 2020 దాకా వెయిట్ చేయాల్సిందే.. 2020 ఆటో ఎక్స్ పోలో ఈ సరికొత్త కరిజ్మా ప్రదర్శనలో పెడతారట. బిఎస్-6 తో ఈ వెహికల్ అందుబాటులోకి వస్తుంది.  



మరింత సమాచారం తెలుసుకోండి: