దేశీయ దిగ్గజ మోటార్ సంస్థ మహింద్రా అండ్ మహింద్రా నుండి మరో కొత్త రకం ఎక్స్.యు.వి మోడల్ రిలీజ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఎక్స్.యు.వి 500 ఫ్లాగ్ షిప్ మోడల్ ను ఫేస్ లిఫ్ట్ గా రిలీజ్ చేసేందుకు మహింద్రా అన్ని ఏర్పాట్లు చేసింది. ఇక దీని ట్రైల్ రన్ ఇండియన్ రోడ్ల మీద జరిపారని తెలుస్తుంది. మహింద్రా నుండి వస్తున్న ఈ ఎక్స్.యు.వి 500 కొత్త మార్పులను తీసుకుని వస్తుంది.


ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న ఎక్స్.యు.వి కన్నా ఇది మరింత అధునాతన ఫ్యూచర్స్ తో వస్తుందని తెలుస్తుంది. రెగ్యులర్ మోడల్ లానే కొత్త ఎక్స్.యు.వి 500 న్యూ మొడల్ ఉన్నా లేటెస్ట్ టెక్నాలజీతో వస్తుందని అంటున్నారు. డ్యాష్ బోర్డ్, సీటింగ్ లేవుట్ దీనిలో ప్రత్యేకంగా ఉంటాయట. ఇక ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో వంటి ఫీచర్స్ టచ్ స్క్రీన్ లో ఈ వెహికల్ లో అందుబాటులో ఉంటాయట.



మరింత సమాచారం తెలుసుకోండి: