ఇండియాలో జరుగనున్న ఆటో ఎక్స్ పోలో దిగ్గజ హీరో మోటో కార్ప్ నుండి బైక్ ప్రదర్శనలు జరుగనున్నాయి. ద్విచక్ర వాహనా రంగంలో రారాజుగా ఉన్న హీరో మోటార్స్ ఇప్పుడు కస్టమర్స్ కు మరింత సౌకర్యవంతంగా ఉండేలా తమ మోడల్స్ ను అందుబాటులోకి తెస్తుంది. ఇక ఈ ఆటో ఎక్స్ పోలో హీరో నుండి ఎక్స్ పల్స్ అడెంచర్ మోటర్ సైకిల్ ప్రదర్శనలో ఉండనుందట. ఇటలీలో జరిగిన ఐక్మా మోటర్ షోలో ఈ బైక్ ప్రదర్శన జరిగిందట.


ఇక 125 సిసి కెపాసిటీ గల స్కూటర్ ను కూడా 2018 ఆటో ఎక్స్ పోలో ప్రదర్శనలో ఉంచుతుందట హీరో మోటో కార్ప్. అడ్వెంచర్ బైక్ తో పాటుగా, 125 సిసి స్కూటర్ ఇంకా 200సిసి కెపాసిటీ కలిగిన ఎక్స్ ట్రీం 200ఎస్ బైక్ ను కూడా ఆటో ఎక్స్ పోలో ఉంచుతారట. కొత్తరకం డిజైన్లతో హీరో తన బ్రాండ్ వాల్యూకి తగినట్టుగా మోటర్ బైకులను రిలీజ్ చేస్తుంది. 


ఇక స్కూటర్ డిమాండ్ పెరుగుతున్న ఈ టైంలో హీరో నుండి 125 సిసి స్కూటర్ కూడా అందుబాటులోకి వస్తుంది. స్కూటర్ విభాగంలో మార్కెట్ లో కాస్త వెనుపడి ఉన్నా కచ్చితంగా ఈ సరికొత్త 125 సిసి స్కూటర్స్ తో సేల్స్ పెంచుకునే అవకాశం ఉందని అంటున్నారు.  



మరింత సమాచారం తెలుసుకోండి: