బెస్ట్ మైలేజ్ బైకులుగా పేరుగాంచిన హీరో బైకులు ప్రస్తుతం తమ బైక్ రేటుని పెంచుతున్నట్టు తెలుస్తుంది. ఎస్క్ షోరూం ప్రైజ్ మీద మోడల్ ను బట్టి ఈ ప్రైజ్ పెంచడం జరిగింది. ఇక ఈ పెరిగిన ధరలు వెంటనే మార్కెట్ లో అమలు కావడం విశేషం. ఆర్ధిక ఒడిదుడుకులను తట్టుకునే కారణం చేతనే స్వల్పంగా బైక్ రేటులను పెంచడం జరిగిందని అంటున్నారు.


2018 మొదట్లో ప్రతి హీరో మోడల్ మీద 400 రూపాయలు పెంచిన హీరో మోటో కార్ప్ ఇప్పుడు మరింత పెంచేలా చూస్తుంది. ఇప్పటికే టివిఎస్ తమ బైక్ రేటుని హైక్ చేయడం జరిగింది. హీరో వెహికల్ అంటే కస్టమర్స్ లో మంచి ప్రాధాన్యత ఉంది అందుకే ఇప్పటికి మార్కెట్ లో ఎన్ని మోడల్ బైకులొస్తున్నా అందరి చూపు హీరో మీదే ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: