జపాన్ దిగ్గజ మోటార్ సంస్థ అయిన సుజుకి నుండి కొత్త మోడల్ బైక్ కస్టమర్స్ ను ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా సుజుకి జిక్సర్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టెం వస్తుంది. సుజుకి జిక్సర్ ఏబిఎస్ వేరియెంట్ యొక్క ధర రూ. 87,250 ఎక్స్ షోరూం ప్రైజ్ గా నిర్ణయించబడింది. టూ వీలర్స్ సేఫ్టీ దృష్టిలో ఉంచుకుని ఏబిఎస్ టెక్నాలజీని సుజుకి పరిచయం చేస్తుంది.


ఇక సుజుకి జిక్సర్ ఏబిఎస్ బైక్ పరంగా లుకింగ్ కు ఏవిధమైన మార్పులు చేయలేదు. స్టాండర్డ్ వేరియెంట్ పోలికతోనే ఈ బైక్ కూడా వస్తుంది. ఇక టెక్నికల్ గా కూడా జిక్సర్ అదే ఫీచర్స్ తో వస్తుంది. 154.9 సిసి కెపాసిటీతో గాలిలో చల్లబడే సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ తో పాటుగా 5 గేర్ బాక్స్ అనుసంధానం ఉంటుంది.


14.5 బిహెచ్పి పవర్ ఇంకా 14 ఎన్.ఎం టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ వేగంగా కూల్ అవడానికి బెస్త్ కూలింగ్ సిస్టెం సుజుకి అందుబాటులోకి తెచ్చింది. మరి ఇంకెందుకు ఆలస్యం మార్కెట్ లోకి రాబోతున్న ఈ సరికొత్త జిక్సర్ ఏబిఎస్ ఓసారి ట్రై చేయండి.



మరింత సమాచారం తెలుసుకోండి: