టివిఎస్ మోటార్ నుండి ఎలెక్ట్రిక్ మోటార్ తో పాటుగా పెట్రోల్ ఇంజిన్ తో నడిచే హైబ్రిడ్ స్కూటర్ ను రిలీజ్ చేస్తున్నారు. భారతదేశంలోనే మొదటి హైబ్రిడ్ స్కూటర్ టివిఎస్ ఐక్యూబ్ రిలీజ్ కాబోతుంది. ఈ ఏడాది చివరలో ఈ స్కూటర్ రిలీజ్ చేసేందుకు టివిఎస్ రంగం సిద్ధం చేస్తుంది. 


2016లో ఆటో ఎక్స్ పోలో ప్రదర్శనగా ఉంచిన టివిఎస్ ఐక్యూబ్ హైబ్రిడ్ 100 సిసి పెట్రోన్ ఇంజిన్ తో పాటుగా 150 వాట్స్, 500 వాట్స్ సామర్ధ్యం కలిగిన రెండు బ్యాటరీ ఆప్షన్స్ తో లభిస్తుంది. గంటకు 20 కిలోమీటర్ల స్పీడ్ కు తక్కువగా ప్రయాణం చేస్తుంటే ఎలెక్ట్రిక్ పవర్ తో ఈ స్కూటర్ నడుస్తుంది. దాన్ని మించి వెళ్తే పెట్రోల్ తో స్కూటర్ రన్ అవుతుంది.   


ఎలెక్ట్రిక్ వెహికల్స్ వాడేందుకు ఆసక్తి చూపుతున్న ఈ తరుణంలో టివిఎస్ నుండి వస్తున్న ఈ ఐక్యూ హైబ్రిడ్ స్కూటర్స్ కస్టమర్స్ కు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఎలెక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేలా ప్రభుత్వం కూడా చర్యలు చేపడుతుంది. కాబట్టి టివిఎస్ ఐక్యూ హైబ్రిడ్ కు మంచి డిమాండ్ ఏర్పడే అవకాశం ఉంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: