దేశంలో అత్యధికంగా అమ్ముడుపోయే  లక్సరీ బైక్ గా పేరు తెచ్చుకున్న రాయల్ ఎన్ ఫీల్డ్ ఈమధ్యనే థండర్ బర్డ్ 350 బైక్ కు ఏ.బి.ఎస్ బ్రేకింగ్ సిస్టెం యాడ్ చేసి కొత్తగా రిలీజ్ చేసింది. ఇక ఇప్పుడు అదే క్రమంలో థండర్ బర్డ్ 500 ఎక్స్ కు కూడా ఏబిఎస్ బ్రేకింగ్ సిస్టెం తో రిలీజ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 2019లో 125 సిసి నుండి ఆపైన వచ్చే ఏ బైక్ అయినా ఏ.బి.ఎస్ బ్రేకింగ్ సిస్టెంతో రావాలని సూచించింది.


ఈ క్రమంలో రాయల్ ఎన్ఫీల్డ్ అన్ని సెగ్మెంట్స్ లో ఏ.బి.ఎస్ బ్రేకింగ్ సిస్టెం ను అందుబాటులోకి తెస్తుంది. కొత్తగా వస్తున్న ఈ రాయల్ ఎన్ఫీల్డ్ థండర్ బర్డ్ 500 ఎక్స్ బైక్ 2.60 లక్షలు ధరతో వస్తుంది. దేశంలో అన్ని చోట్ల ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ డీలర్స్ దగ్గర ఈ కొత్త బైక్ డెలివరీ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.


త్వరలో మార్కెట్ లోకి రానున్న ఈ రాయల్ ఎన్ఫీల్డ్ థండర్ బర్డ్ బైకులను పొందాలనుకునే వారు ముందుగా దగ్గరలో ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ షోరూంలో 5000 అడ్వాన్స్ ఇచ్చి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇదవరకు ఉన్న థండర్ బర్డ్ 500 ఎక్స్ బైక్ కు ఏమాత్రం తేడా లేకుండా కేవలం ఏ.బి.ఎస్ బ్రేకింగ్ సిస్టెం ఒక్కటే యాడ్ చేసి రిలీజ్ చేస్తున్నారు.   
  



మరింత సమాచారం తెలుసుకోండి: