మారుతి సుజుకి ఓ కొత్త మోడల్ వెహికల్ ను లాంచ్ చేసింది. మారుతి సుజుకి నుండి వచ్చిన ఎర్టిగాకు తదుపరి వర్షన్ గా కొత్త మారుతి సుజుకి ఎర్టిగా టూర్ M రిలీజ్ చేశారు. ప్రత్యేకమైన టెక్నికల్ అప్డేట్స్ తో ఈ సరికొత్త ఎర్టిగా టూర్ M అందుబాటులోకి వస్తుంది. దేశంలో ఎక్కువ కస్టమర్స్ మెచ్చిన మారుతి సుజుకి బ్రాండ్ న్యూ ఎర్టిగా టూ M మరింత క్రేజ్ తీసుకురానుంది.  


ఈ వెహికల్ ధర 7.99 లక్షల ఎక్స్ షోరూం ప్రైజ్ గా నిర్ణయించారు. ప్రత్యేకంగా ఈ వాహనం క్యాబ్ అగ్రిగేటర్స్, ట్యాక్సీలకు బాగా ఉపయోగపడుతుంది. మారుతి సుజుకిలో సక్సెస్ ఫుల్ వెహికల్ గా ఎర్టిగా ప్రతి నెల 9000 ల యూనిట్స్ అమ్మకాలు జరిగేవి.. అయితే అదేవిధంగా ఈ సరికొత్త ఎర్టిగా టూర్ ఎం సేల్స్ కూడా ఉంటాయని చెబుతున్నారు మారుతి సుజుకి టీం.  


ఇక ఈ వెహికల్ 1.5 పెట్రోల్ మోటర్ తో రన్ అవుతుంది. డ్యుయల్ ఫ్రెంట్ ఎయిర్ బ్యాగ్స్, యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టెం, స్పీడ్ ఫంక్షన్, ఇంకా బ్లూతూత్ ఇవన్ని అందుబాటులో ఉన్నాయి. మారుతి సుజుకి ఎర్టిగా టూర్ M కస్టమర్స్ ను ఎట్రాక్ట్ చేస్తుంది. త్వరలో మార్కెట్ లో రానున్న ఈ వెహికల్ సేల్స్ ఎలా ఉంటాయో చూడాలి. ఎర్టిగా టూర్ ఎం 10 వేరియెంట్స్ లో మార్కెట్ లోకి వస్తుంది. ఎర్టిగా ఎల్.ఎక్స్.ఐ ప్రైజ్ 7.44 లక్షలు ఉంది.   
 


మరింత సమాచారం తెలుసుకోండి: