కొత్త మోటారు వాహనాలు చట్టం అప్పుడే చుక్కలు చూపిస్తోంది. దేశంలో రికార్డు స్థాయిలో జరిమానాలు నమోదవుతున్నాయి. తాజాగా నమోదైన ఓ ఫైన్ దేశంలోనే రికార్డుగా చెబుతున్నారు.. ఆ ఫైన్ విలువ అక్షరాలా ఆరున్నర లక్షల రూపాయలు మరి.


వివరాల్లోకి వెళ్తే.. నాగాలాండ్ కు చెందిన లారీ ఒడిశాలోని సంబల్ పూర్ కు వచ్చిందట. ఈనెల 10న ట్రాఫిక్ అధికారులు దాన్ని చెక్ చేశారు. అనేక లోపాలు ఉన్నట్టు గుర్తించారు. గాలి, ధ్వని కాలుష్యం, ఎలాంటి అనుమతులు లేవట. అంతే కాదు. వస్తు రవాణా వాహనంలో ప్రయాణికులను తరలించిందట. వాహన బీమా కూడా లేదట.


అంతేనా.. ఐదేళ్ల నుంచి ఏ పన్నూ కట్టడం లేదట. ఇలా ఇవన్నీ లెక్కలేని ఆ లారీకి ఏకంగా ఆరున్నర లక్షల రూపాయల ఫైన్ వేశారట అధికారులు. ఇప్పటి వరకూ ట్రాఫిక్ చలానాల్లో దేశంలో ఇప్పటిదాకా ఇదే ఆల్ టైమ్ రికార్డుగా నమోదైంది. మరి ఇంకెన్ని విచిత్రాలు చూడాలో అనుకుంటున్నారు జనం.


మరింత సమాచారం తెలుసుకోండి: