కోడెల శివ ప్రసాద్ రావు అభిమాని ఆయన కోడెల కాంస్య విగ్రహాన్ని తయారు చేసిన ఆయన అభిమానాన్ని చాటుకున్నాడు. నవ్యాంధ్రప్రదేశ్ మొదటి సభాపతి, టీడీపీ సీనియర్ నేత కోడెల శివ ప్రసాద్ రావు ఆత్మహత్య చేసుకుని చనిపోయిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ సలహాతో రాజకీయాల్లోకి వచ్చిన కోడెల టీడీపీ పార్టీ కి ఎనలేని సేవలందించారు. కోడెల మరణం తో టీడీపీ పార్టీలో విషాదం నెలకొంది. అయితే కోడెల శివప్రసాద్ రావు మరణాన్ని అభిమానులు తట్టుకోలేక పోతున్నారు.
తమ ప్రియతమ నేత తమతో లేరని శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా ఆయన సొంతూరు నరసరావు పేటలో ఆయన అంత్యక్రియలు జరగ్గ భారీ సంఖ్యలో అభిమానులు కోడెల అంత్యక్రియల్లో పాల్గొని నివాళులర్పించారు.ఆయన నిర్మించిన స్వర్గపురి స్మశాన వాటికలోనే కోడెల అంత్యక్రియలు జరిగాయి. ఈ నేపథ్యంలో కోడెల అభిమాని ఒకరు ఆయన గుర్తుగా కాంస్య విగ్రహాన్ని తయారు చేసాడు. తణుకు దగ్గర నత్త రామేశ్వరం కి చెందిన ఏకే ఆర్ట్స్ సంస్థ అధినేత అరుణ్ ప్రసాద్ ఉడయార్ కోడెల కాంస్య విగ్రహాన్ని తయారు చేసి ఆయనపై ఉన్న అభిమానాన్ని చాటుకున్నాడు. ఈ విగ్రహాన్ని ఆయన కుటుంబ సభ్యులకి ఇవ్వాలని తయారు చేసినట్టు తెలిపాడు ఆయన. కోడెలకు నివాళిగా ఈ విగ్రహాన్ని తయారు చేసినట్టు అరుణ్ ప్రసాద్ తెలిపాడు. కాగా గతంలో కూడా ఎన్టీఆర్ 36 అడుగుల విగ్రహాన్ని కూడా ఈ సంస్థే తయారు చేసింది