మద్రాస్ ఐఐటీ స్నాతకోత్సవంలో 21 ఏళ్ల తమిళనాడుకు చెందిన కవితా గోపాల్ రాష్ట్రపతి బంగారు పతకాన్ని సాధించి ఒక పెద్ద హిస్టరీ క్రియేట్ చేసింది. 60 ఏళ్ల మద్రాస్ ఐఐటీలో తొలిసారి ఈ ఘనతను సాధించిన అమ్మాయిగా ఆమె నిలిచింది. అంతేకాదు.. మరో రెండు అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు.
మద్రాస్ ఐఐటీలో సీఎస్ ఈలో 9.95 గ్రాండ్ స్కోర్ తో రికార్డు క్రియేట్ చేయటమే కాదు.. ఎం. విశ్వేశ్వరయ్య స్మారక పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు. ఈ అవార్డును సొంతం చేసుకున్న తొలి మహిళగా ఆమె నిలిచారు. మూడు అవార్డుల్ని పొందటంపై ఆమె ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.కవితా గోపాల్ ఇలాంటి పతకాలు చాల సాధించాలని కోరుచున్నాము.ఈ అవార్డులను పొందటం తనకు అమితానందాన్ని కలిగిస్తోందని కవితా గోపాల్ చెప్పారు. కవితా గోపాల్ సాధించిన చరిత్ర 60 ఏళ్ల మద్రాస్ ఐఐటీలో పెద్ద రికార్డుగా నిలిచింది.