సాధారణంగా మనిషి అందం సూచించేవాటిలో జుట్లు, కళ్లు,ముక్కు తో పాటు పళ్లు కూడా చాలా ప్రాధాన్యంగా చూస్తారు. ముఖంపై అన్ని అవయవాలు బాగున్నా పంటి వరుస బాగా లేకున్నా గారె పట్టినా ఎదుటి వాళ్లు కాస్త చిన్న చూపు చూస్తారు. మనం దంతాలను రోజూ శుభ్రం చేసుకుంటే ఎలాంటి దుర్వాసన ఉండకుండా దంతాలు కూడా చక్కగా ఉంటాయి. 


దంతాల శుభ్రత కోసం మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు :

పళ్ళను బ్రెష్ చేయటం వలన పొందే తెలుపు ఏ ఇతర ఉత్పత్తులను ఉపయోగించిన రాదు. పళ్ళని పరిశుభ్రంగా ఉంచుకొని పళ్ళు పచ్చగా మారటాన్ని వివిధ రకాల దంత సమస్యల నుండి దూరంగా ఉండాలి. పళ్ళని రోజు కు రెండు సార్లు తోమాలి. దంతాలపై ఎక్కువ సమయం తోమటం వలన దంతాలలో పైన ఉండే చెడు ఫలకము తొలగిపోతుంది.


కాఫీ, టీ వంటి ద్రావణాలు పల్లకి అతుక్క పోయి, పళ్ళ తెల్లదనాన్ని పోగొడతాయి. మీ పల్లకి అతుక్కపోయే చల్లటి శీతల పానీయాలని తాగాకూడదు.ఒకవేళ వాటిని తాగాల్సి వస్తే వాటిని పళ్ళకి తగలకుండా చూసుకోవాలి. శీతల పానీయాలని తాగేతపుడు, స్ట్రా వాడటం. లేదా పళ్ళకి అతుక్కపోయే ద్రావణాలని తాగిన తరువాత నీటితో పుకిలించటం వలన పళ్ళకి కలిగే ప్రమాదాలకి దూరంగా ఉంచవచ్చు.


పుదీనా ఆకులు క్రిమిసంహారకము. పుదీనా ఆకులను నీటితో శుభ్రం చేసుకొని నోట్లో వేసుకొని నమలడం వలన పళ్ళు సమస్యలన్ని, దురువాసన ను కూడా తోలగిస్తుంది.


దంతాలకి తెల్ల దనాన్ని పాడు చేయటానికి పట్టి ఉన్న పదార్ధాలని తోలగించే మాలిక్ ఆసిడ్, స్ట్రాబెర్రీలో పుష్కలంగా ఉన్నాయి. రోజులో ఒకసారి స్ట్రాబెర్రీని దంతాలకి రాయటం వలన తెలుపుని పొందవచ్చు. స్ట్రాబెర్రీని పళ్ళకి రాసిన తరువాత బ్రెష్ చేయటం చాలా మంచిది.


తినే సోడా అనేది పళ్ళు తెల్లగా మారటానికి శక్తివంతమైన సహజసిద్దమైన గృహా వైద్యం . ఇది సహజసిద్దంగా శుభ్రపరచి, పళ్ళని తెల్లగా మార్చే శక్తిని కలిగి ఉంటుంది. చిటికెడు ఉప్పు , బేకింగ్ సోడాని కలిపి కొన్ని నీటి చుక్కలని కలిపి జిగురు పదార్ధంలా చేయాలి. ఈ సహజ సిద్దమైన జిగురు పదార్థంతో రెండు వారాలకి ఒకసారి బ్రెష్ చేయాలి. తోమిన తరువాత మీ దంతాల నుండి బేకింగ్ సోడాని పుకిలించి తోలగించుకోవాలి.


పీచు పద్దార్థలు ఉన్నా ఆహారాలు ,పళు , గ్రీన్ వెజిటేబుల్స్ ను తీసుకోవడం వల్ల దంతాలను గట్టి గా ఉంచతాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: