ఎప్పుడు చూడు.. మేకప్ కోసం వేలు వేలు తగలెట్టాల్సి వస్తుంది. అయితే అలాంటి మేకప్ ఖర్చు లేకుండా సహజసిద్ధంగా తయారవ్వడానికి ఈ ముల్తానీ మట్టి ఎంతగానో ఉపయోగపడుతుంది. కేవలం 30 రూపాయిల్లో లక్షలు విలువైన మేకప్ సొంతం అవుతుంది. అది ఎలా అనేది.. ఎలా ఉపయోగిస్తే అందంగా ఉంటాం అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.
మిల్క్ పౌడర్, బాదం పొడి, బియ్యప్పిండి, గులాబీ రేకుల అన్ని మూట కట్టి ఆ ముఠాతో నెమ్మదిగా రుద్దుకోవాలి.
చల్లని పాలలో నువ్వుల నూనె కలిపి కాటన్ బాల్ను ఈ మిశ్రమంలో ముంచి చర్మం మీద మర్ధన చేసుకుంటే ముఖం మీది మలినాలు తొలిగిపోతాయి.
ముల్తానీ మట్టిని ముఖం మీద పట్టిస్తే జిడ్డు అంత తొలగి స్కిన్ ఆయిలీగా కనిపించకుండా చేస్తుంది.
ముల్తానీ మట్టి చర్మానికి కాంతినిస్తుంది, మృదువుగా మారుస్తుంది.
జిడ్డు చర్మం ఉన్నవారు ముల్తానీ మట్టిలో రోజ్ కలిపి ప్యాక్లా వేసుకోవాలి అప్పుడు కళ్లు, పెదాల దగ్గర అంటకుండా జాగ్రత్తపడాలి.
తేనె, నిమ్మరసం కలిపి రోజూ ముఖానికి రాసుకోవాలి. 20 నిమిషాల తరువాత నీళ్లతో కడుక్కుంటే చర్మం సున్నితంగా మారుతుంది.
వారానికి ఒకసారి లేదా రెండుసార్లు చర్మం మీది మృతకణాలను స్క్రబింగ్ ద్వారా తొలగించుకోవాలి.