అందంగా కనిపించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.. ఎందుకంటే అందమే ఆనందం కాబట్టి. అందానికి మెరుగులు ఈ చిట్కాలు పాటించండి. అరటిపండితో చర్మాన్ని మిల మిల మెరిపించండి.. అయితే ఆ చిట్కాలు ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.
ఫేస్ మాస్క్...
సగం అరటిపండు, చెంచా తేనె, టేబుల్ స్పూన్ పాలు అన్ని కలిపి పేస్టులా చేసుకోవాలి. దీన్ని ముఖానికి, మెడకు పట్టించి పావు గంట పాటు ముఖానికి పట్టించాలి. ఆ ఫేస్ మాస్క్ ఆరిన తర్వాత చల్ల నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. వారానికి ఒకసారి ఇలా చేస్తే చర్మం మెరిసిపోతుంది.. అందంగా తయారవుతుంది.
స్క్రబ్...
రెండు టేబుల్ స్పూన్ల ఓట్స్, రెండు అరటి పండ్లు, టీ స్పూన్ తేనె అన్ని మిక్సీలో వేసి మెత్తగా చేసుకొని ఆ మిశ్రమాన్ని మర్దన చేసుకుంటూ ముఖం, మెడకు పట్టించాలి. ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగేస్తే సరిపోతుంది. ఈ చిట్కా పాటించడం వల్ల చర్మంపై పేరుకున్న మురికి అంత కూడా తొలగిపోతుంది.