ఎలాంటి మచ్చలు లేకుండా అందంగా, కాంతివంతంగా, మృదువుగా చర్మం మెరిసిపోవాలని అందరూ భావిస్తుంటారు. అలా కోరుకోవడంలో ఎలాంటి తప్పు లేదు. కానీ మన చర్మం అలా ఉండడం అసాధ్యం అనే చెప్పాలి. ఎందుకంటే.. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. ఏదో ఒక్క చర్మ సమస్య మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఫలితం.. మార్కెట్లో దొరికే వివిధ ప్రోడెక్ట్స్ను వేలకు వేలు ఖర్చు చేసి ఉపయోగిస్తుంటారు. అయినప్పటికీ ఫలితం లేదు భంగపడతారు.
కానీ, ఓట్స్ మాత్రం చర్మ సౌందర్యానికి ఎంతో చక్కగా సహాయపడతాయి. ఓట్స్లో ప్రోటీన్,ఇనుము,మెగ్నీషియం, పొటాషియం, సెలీనియం, ఫోలేట్, మరియు ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు వంటి పోషకాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యాన్ని పెంపొందించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అలాగే వోట్స్ మీకు బరువు తగ్గడానికి సహాయపడే డైటరీ సప్లిమెంట్ మాత్రమే కాదు.. చర్మాన్ని మెరిపించడంలోనూ ఉపయోగపడుతుంది. మరి చర్మానికి ఓట్స్ ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఓట్స్ను తీసుకుని మెత్తని పిండిలా చేసుకోవాలి.
అనంతరం ఆ ఓట్స్ పిండికి కొద్దిగా తేనె, పెరుగు మరియు గోరువెచ్చని నీరు వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి.. అరగంట పాలు అలా వదిలేయాలి. అనంతరం చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల మొటిమలు, మచ్చలు సమస్య తగ్గుముఖం పడుతుంది. అలాగే ఈ ప్యాక్ చర్మానికి తగిన తేమను అందించి, మాయిశ్చరైజర్గా ఉపయోగపడుతుంది. మరియు చర్మ రంధ్రాల్లోని మురికిని, ఎక్కువగా ఉన్న జిడ్డును తొలగించి చర్మాన్ని శుభ్ర పరుస్తుంది. తద్వారా ముఖం కాంతివంతంగా మెరిస్తుంది. కాబట్టి, తప్పకుండా ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి.