జీవం లేకుండా పొడి బారి పోయిన చర్మంతో ఎన్నో చిక్కులు వస్తుంటాయి. ఆ చర్మాన్ని తిరిగి కాంతివంతంగా చేయాలంటే ఈ చిట్కాలు వాడి చూడండి మినుములను పొట్టుతో సహా పొడి చేయాలి. ఆ పొడిలో ఒక స్పూన్ పెరుగు కలిపి రాసుకోవాలి. రెండు టీ స్పూన్ల గోధుమపిండిలో తగినన్ని పాలు పోసి ఉండలు లేకుండా కలపాలి.


ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి వేళ్ళతో సున్నితంగా రుద్దాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. జీవం లేని పొడి బారిన చర్మం కళకళలాడుతుంది. బాదంనూనెను ముఖానికి అప్లయి చేయాలి కోడిగుడ్డులో పచ్చసొన ముఖానికి రాయాలి ఆలివ్ ఆయిల్ తో ముఖానికి మసాజ్ చేసుకోవాలి ముప్పయి ఐదు ఏళ్ళు దాటిన స్త్రీలు అప్పుడప్పుడు థర్మోహెర్బల్ మాస్క్ వేసుకోవాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి: