తిరుమలలోని శ్రీవారి బూంది పోటులో ఈ రోజు మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. దీంతో బూంది పోటులో మంటలు భారీగా ఎగసిపడ్డాయి.  సిబ్బంది వెంటనే అప్రమత్తం కావడంతో..అగ్నిమాపక దళానికి సమాచారం అందించారు. వెంటనే అక్కడకు చేరుకున్న అగ్నిమాపక దళ సిబ్బంది రెండు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
Image result for శ్రీవారి బూంది పోటు
అయితే ప్రమాదానికి కారణం పూర్తి స్థాయిలో తెలియకున్నా..విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయ్యింటుందని టీటీడీ అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నారు. శ్రీరామ నవమి సందర్భంగా కూడా తిరుమలలో అపశృతి జరిగిన విషయం తెలిసిందే. నిత్యం భక్తులతో కిట కిటలాడే తిరుమలలో ఇలాంటి సంఘటనలు పలు ప్రశ్నలకు తావిస్తుంది.

ఇప్పుడు   ఒక్కసారిగా బూంది పోటు నుంచి మంటలు ఉవ్వెత్తున ఎగసిపడటంతో భక్తులు భయాందోళనకు గురయ్యారు. కొందరైతే ఎలాంటి ఘోరం జరగకుండా కాపాడాలంటూ 'గోవిందా...గోవిందా...' నినాదాలు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: