కొబ్బరినూనె, వేప నూనెలను ఉపయోగించి తయారు చేసిన హెయిర్ ఆయిల్ను వాడితే మంచిది. దీంతో చుండ్రు పోవడమే కాదు, జుట్టుకు పోషణ అందుతుంది. తద్వారా శిరోజాలు దృఢంగా, ఒత్తుగా పెరుగుతాయి కూడా. వెంట్రుకలు కాంతివంతంగా మారుతాయి.
రాత్రంతా మెంతులను నానబెట్టి తెల్లవారుజామున వాటిని మెత్తని పేస్ట్ లా రుబ్బాలి. తరువాత ఒక అరగంట పాటు జుట్టుకి ఈ పేస్ట్ ని బాగా పట్టించి కొంత సేపు వేచి ఉన్నాక తేలికపాటి షాంపుతో తలస్నానం చేయాలి. ఇలా వారంలో రెండు సార్లు చేస్తే చాలు, చుండ్రు బాధ తప్పుతుంది.
ఒక కప్పు గోరు వెచ్చని నీటిలో టీ ట్రీ ఆయిల్ను ఒక టీస్పూన్ కలపాలి. బాగా కలిపాక ఈ నీటితో జుట్టుకి మర్దనా చేయాలి. అరగంట తరువాత తలస్నానం చేయాలి. దీంతో చుండ్రు బాధించదు.